Webdunia - Bharat's app for daily news and videos

Install App

14 సార్లు చేశాను... ఇక నా వల్ల కాదు...

Webdunia
సోమవారం, 11 మార్చి 2019 (18:52 IST)
భారతదేశంలో లోక్‌సభ ఎన్నికల నగారా మోగడంతో దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో సందడి మొదలైంది. షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి? అభ్యర్థులను ఎంపిక చేయడం, ఖరారు చేయడం వంటి అంశాలలో తలమునకలై ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో కొంతమంది రాజకీయ కురువృద్ధులు సమాలోచనలు చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధినేత, మాజీ కేంద్ర మంత్రి శరద్ పవార్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయడం లేదని ప్రకటించారు. అయితే తమ కుటుంబంలోని వారు మాత్రం పోటీలో నిలుస్తారని వెల్లడించారు. ఇప్పటికే తాను 14 సార్లు ఎన్నిక‌ల్లో పోటీ చేసానని, విశ్రాంతి తీసుకునేందుకు ఇదే సరైన సమయంగా తాను భావిస్తున్నట్లు పేర్కొన్నాడు. 
 
కూతురు సుప్రియా సూలే, మనవడు పార్థ పవార్ లోక్‌సభ బరిలో దిగనున్నారని చెప్పాడు. 2014 సాధారణ ఎన్నికల్లోనూ పవార్ పోటీ చేయలేదు. అయితే ఈసారి మాత్రం పోటీ చేస్తారని పార్టీనేతలు, కార్యకర్తలు భావించారు. తాజా నిర్ణయంతో తాను పూర్తిగా విశ్రాంతి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments