Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిద్రపోయే ముందు మొబైల్ పక్కనే పెట్టుకుంది.. అంతే మహిళ మృతి

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (16:13 IST)
Redmi 6A
ఓ మొబైల్ ఫోను ఓ మహిళ ప్రాణాలు బలి తీసుకుంది. నిద్రపోయే ముందు.. మొబైల్ పక్కనే పెట్టుకుంది. అలా చేయడం ద్వారా ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సదరు మహిళ రాత్రిపూట ఫోన్ వాడిన ఆమె.. దాన్ని తల దగ్గర దిండు పక్కనే పెట్టుకొని పడుకుంది.
 
అర్ధరాత్రి సమయంలో ఆ మొబైల్ పేలిపోయింది. దీంతో తలకు తీవ్రమైన గాయమై విపరీతంగా రక్తం పోయిన ఆమె దుర్మరణం పాలైంది. దీని గురించిన వివరాలను ఎండీ టాక్ అనే యూట్యూబ్ ఛానెల్ నడిపే మంజీత్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.
 
'నిన్న రాత్రి మా ఆంటీ చనిపోయింది. ఆమె రెడ్‌మీ 6ఏ వాడుతోంది. రాత్రి పడుకునే సమయంలో దిండు పక్కనే దాన్ని పెట్టుకొని పడుకుంది. కాసేపటికి అది పేలిపోవడంతో ఆమె చనిపోయింది. ఇది మాకు చాలా విషాదమైన సమయం. మాకు సాయం చేయాల్సిన బాధ్యత బ్రాండ్‌పై ఉంటుంది' అని అతను ట్వీట్ చేశాడు. 
 
ఇది చూసిన నెటిజన్లు రెడ్‌మీపై మండిపడుతున్నారు. సదరు కుటుంబానికి సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై తాము కూడా విచారణ జరుపుతున్నామని రెడ్‌మీ కంపెనీ తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamanna: ఓదెల 2లో మేకప్ లేకుండా భైరవి క్యారెక్టర్ చేయడం అదృష్టం : తమన్నా భాటియా

Sai Pallavi: రాత్రి 9 గంటలకల్లా నిద్రపోతాను.. ఉదయం 4గంటలకల్లా నిద్రలేస్తాను.. సాయిపల్లవి

రాజమౌళి వల్లే సినిమా ఒక్కటైంది, మేం తెలుగు సినిమాలు చూస్తాం : మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్

Sridevi: అమ్మా.. కాకినాడ శ్రీదేవి.. కృతిశెట్టి, శ్రీలీల, వైష్ణవిలా కావొద్దు.. కాస్త వెరైటీగా ఆలోచించు..?

Ivana: లవ్ టుడే.. ఆ కళ్ళతో కట్టిపారేసింది.. శ్రీదేవి, మీనా, రాశి బాటలో ఇవానా!?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments