Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ ఎమ్మెల్యేపై ఆరోపణలు.. రెండేళ్ల పాటు అత్యాచారం.. కావాలంటే డీఎన్ఏ టెస్టు?

Webdunia
శనివారం, 15 ఆగస్టు 2020 (17:29 IST)
ఉత్తరాఖండ్ బీజేపీ ఎమ్మెల్యేపై ఓ మహిళ సంచలన ఆరోపణలు చేసింది. ద్వారాహత్ ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగి తనపై రెండేళ్లుగా అత్యాచారం జరిపాడని, ఆయన వల్ల తనకు ఆడపిల్ల కూడా పుట్టిందని బాంబు పేల్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం ఉత్తరాఖండ్‌లో సంచలనం రేపుతోంది. ఐతే ఆ ఆరోపణలను ఎమ్మెల్యే ఫ్యామిలీ తిప్పికొట్టింది. 
 
సదరు మహిళ తప్పుడు ఆరోపణలు చేస్తోందని..రూ.5 కోట్లు ఇస్తే ఓకే అని, లేదంటే తప్పుడు కేసు పెడతానంటూ బెదిరిస్తోందని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే మహేష్ సింగ్ నేగి భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు డెహ్రడూన్‌లోని నెహ్రూ కాలనీ పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
 
అయితే సదరు మహిళ సాయంత్రం ఓ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది, దీనిలో ఎమ్మెల్యే భార్య రీటా నేగి తప్పుడు ఫిర్యాదు చేసినట్లు ఆరోపించింది. గత రెండేళ్లుగా ఎమ్మెల్యే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించింది. ఎమ్మెల్యేతో కూతురు ఉందని... తన వాదనలను నిరూపించుకోవడానికి ఆమె తన కుమార్తె, ఎమ్మెల్యేకు డీఎన్ఎ పరీక్ష చేయమని డిమాండ్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం