Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి మరో ఐదునిమిషాల్లో, పెళ్లిపీటల మీదే వధువు ఒరిగిపోయింది...

Webdunia
సోమవారం, 29 జూన్ 2020 (22:36 IST)
మరో ఐదునిమిషాల్లో పెళ్లి జరుగబోతోంది. మంగళ వాయిద్యాలతో అన్నీ సిద్ధం చేశారు. ఇక పెళ్ళి అయిపోతుందని అందరూ అనుకున్నారు. అయితే చివరి క్షణంలో వధువు పెళ్లి పీటలపై నుంచి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో అర్థం కాక కుటుంబ సభ్యులు వధువును ఆసుపత్రికి తీసుకెళ్ళారు.
 
ఉత్తరప్రదేశ్ లోని కనౌజ్ జిల్లా థాథియా పోలీస్ సర్కిల్ భగత్ పూర్వ గ్రామం. సంజయ్, వనితలకు పెళ్ళి నిశ్చయించారు. ఆదివారం వివాహం జరగాల్సి ఉంది. కరోనా సమయం కావడంతో బంధువులు తక్కువ సంఖ్యలో పెళ్ళికి హాజరయ్యారు.
 
గ్రామస్తులు కూడా పెద్దగా పెళ్ళికి రాలేదు. సామాజిక దూరంతో పెళ్ళి జరుగుతోంది. మంగళ వాయిద్యాలతో మరికాసేపట్లో సంజయ్ వనిత మెడలో తాళికట్టాల్సి ఉంది. అయితే ఇంతలో ఒక్కసారిగా వనిత కిందపడిపోయింది.
 
హుటాహుటిన ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళారు. కోవిడ్ పరీక్షలు చేస్తే తప్ప ఆమెను పరీక్షించమన్నారు. అయితే కోవిడ్ ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఆసుపత్రిలోపల అత్యవసర విభాగానికి తీసుకుని వెళ్లేలోపే ఆమె మరణించింది. ఆమె గుండెపోటుతో మరణించిందని వైద్యులు నిర్థించారు. వనిత మరణంతో ఒక్కసారిగా వారి కుటుంబంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments