Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో వ్యాప్తిస్తున్న కరోనా.. ఒక్క రోజుల్లో రెట్టింపు కేసులు.. ఇద్దరు మృతి!

Webdunia
బుధవారం, 15 మార్చి 2023 (12:56 IST)
మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా వ్యాపిస్తుంది. ఈ రాష్ట్రంలో ఒక్క రోజులోనే కరోనా కేసులు రెట్టింపు అయ్యాయి. ఈ వైరస్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య కూడా పెరిగుతోంది. ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. ఒక్క మంగళవారమే ఏకంగా 155 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోల్చితే ఈ కేసులు రెట్టింపు అయ్యాయి. అంతేకాకుండా, ఇద్దరు కరోనా బాధితులు కూడా ప్రాణాలు కోల్పోయారు. కరోనాతో ప్రాణాలు పోవడం చాలా కాలం తర్వాత నమోదు కావడం గమనార్హం. 
 
కాగా, మంగళవారం నమోదైన కరోనా కేసుల్లో అత్యధికంగా 75 కేసులు నమోదు కాగా, ముంబై సర్కిల్‌లో 49 మందికి ఈ వైరస్ సోకింది. నాసిక్‌లో 13 కేసులు వచ్చాయి. దీంతో కేసుల సంఖ్య 81.38 లక్షలకు చేరుకోగా, మృతుల సంఖ్య 1,48,426కు పెరిగింది. సోమవారం మహరాష్ట్రలో 61 కేసులు నమోదు కావడం గమనార్హం. 
 
మొత్తంమీద ఇప్పటివరకు మహారాష్ట్రలో కరోనా రికవరీ రేటు 98.17 శాతంగా ఉంది. మరణాల రేటు మాత్రం 1.82 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా మంగళవారం 402 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయని, వీటితో కలుపుకుంటే ఇప్పటివరకు కరోనా వైరస్ బారినపడిన వారి సంఖ్య 4.46 కోట్లకు చేరుకుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments