Webdunia - Bharat's app for daily news and videos

Install App

కత్తితో పొడవడానికి వచ్చిన భర్తను.. భార్యే కడతేర్చింది

Webdunia
శనివారం, 31 జులై 2021 (10:41 IST)
మద్యం కుటుంబాలలో చిచ్చు రేపుతోంది. మద్యం మత్తులో దారుణాలకు తెగబడుతున్నారు కొంతమంది. భార్యలపై దాడులు చేస్తూ..చివరకు ప్రాణాలు తీస్తున్నారు. ఇలాగే ఓ ఘటన జరిగింది. మద్యం మత్తులో కత్తితో పొడవడానికి వచ్చిన ఓ భర్తను.. భార్యే కడతేర్చింది. ఈ ఘటన కాంచీపురంలో చోటు చేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే.. కాంచీపురం మల్లిగశెట్టి వీధిలో నౌషద్ (37), రేవతి (30) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె, కుమారుడున్నాడు. నౌషధ్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. నౌషధ్ మద్యానికి అలవాటు పడ్డాడు. రోజు మద్యం తాగి వచ్చి.. భార్యతో గొడవపడేవాడు.
 
ఈ క్రమంలో నౌషద్ గురువారం అర్ధరాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చాడు. దంపతుల మధ్య గొడవ ప్రారంభమైంది. ఆగ్రహానికి గురైన నౌషద్ కత్తి తీసుకుని ఆమెపై దాడి చేయడానికి ప్రయత్నించాడు. ఆమె తప్పించుకోవడంతో..అదుపుతప్పి కిందపడ్డాడు. 
 
రషియా వెంటనే అదే కత్తి తీసుకుని అతనిపై దాడి చేసింది. దాడిలో నౌషద్ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు రేవతిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments