Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇష్టం లేని పెళ్ళి.. ఫోన్‌లో మాటలే మాటలు.. భర్తనే చంపేసిన భర్త.. ఎక్కడ?

సెల్ ఫోన్‌లూ, సోషల్ మీడియాలతో కాపురాలు గుల్లవుతున్నాయి. భార్యాభర్తల మధ్య విలువలు మంటగలిసిపోతున్నాయి. ఇష్టం లేని పెళ్లి చేసుకుని బలవంతంగా కాపురం చేస్తున్న దంపతుల మధ్య సెల్ ఫోన్ విషయంలో గొడవ ఏర్పడింది.

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2016 (10:51 IST)
సెల్ ఫోన్‌లూ, సోషల్ మీడియాలతో కాపురాలు గుల్లవుతున్నాయి. భార్యాభర్తల మధ్య విలువలు మంటగలిసిపోతున్నాయి. ఇష్టం లేని పెళ్లి చేసుకుని బలవంతంగా కాపురం చేస్తున్న దంపతుల మధ్య సెల్ ఫోన్ విషయంలో గొడవ ఏర్పడింది.

ఎప్పుడూ చూసినా ఫోన్లో మాట్లాడుతున్న భార్యను ప్రశ్నించిన భర్త.. ఆమె చేతిలోనే హత్యకు గురైనాడు. బీహార్‌లోని నలందలో నివాసం ఉంటున్న సతీష్ (36) అనే వ్యక్తి సోమవారం రాత్రి భార్య లలిత చేతిలో దారుణ హత్యకు గురైనాడు. సతీష్‌ను వివాహం చేసుకోవడం లలితకు ఇష్టం లేదు.. సతీష్‌కు కూడా ఆమెను పెళ్ళాడటం ఇష్టం లేదు. సతీష్ లలిత అక్క సంగీతను పెళ్లిచేసుకోవాలనుకున్నాడు. కానీ సతీష్ పెళ్ళి లలితతో జరిగిపోయింది. 
 
ఏడాది క్రితం వీరి వివాహం జరిగిపోయింది. పెళ్ళైనప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవ జరిగేది. లలిత నిత్యం ఫోన్ లో ఎవరితోనే మాట్లాడుతుండేది. ఇదే విషయంపై దంపతుల మధ్య గొడవ ఎక్కువ అయ్యేది. సోమవారం రాత్రి సతీష్ గట్టిగా ఎవరితో మాట్లాడుతున్నావని లలితను ప్రశ్నించాడు. తరువాత సతీష్ బెడ్ రూంలోకి వెళ్లి నిద్రపోయాడు. దాంతో కోపంతో ఉన్న లలిత పదునైన కత్తి తీసుకుని బెడ్ మీద నిద్రపోతున్న సతీష్‌పై కత్తితో దాడి చేసింది. తీవ్ర గాయాలతో సతీష్ మృతి చెందాడు. లలితను పోలీసులు అరెస్ట్ చేశారు. 

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments