Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుమార్తె రెండో వివాహం... రజినీకాంత్ సైలెంట్... ఎందుకు?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (17:49 IST)
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రెండో పెళ్ళికి సిద్ధమైంది. ఇప్పటికే భర్త అశ్విన్ రామ్ కుమార్‌తో మనస్పర్థల కారణంగా విడిపోయిన సౌందర్య, తండ్రితో పాటు కలిసి ఉంటోంది. ఐదు సంవత్సరాల తన కుమారుడు వేద్ క్రిష్ణతో కలిసి ఉంటోంది సౌందర్య. అయితే గత కొన్నిరోజులుగా ప్రేమలో ఉన్న సౌందర్య ప్రేమికుడినే రెండవ పెళ్ళి చేసుకునేందుకు సిద్ధమవుతోంది.
 
ఆయనెవరో కాదు ప్రముఖ వ్యాపారవేత్త, నటుడు విశ్గన్ వనంగమూడి. ఈయన కూడా మొదటి వివాహం చేసుకుని భార్యను వదిలేశాడు. ఇద్దరి మధ్య గత కొన్నిరోజులుగా ప్రేమాయణం నడుస్తుండటంతో తమిళ సినీ పరిశ్రమలో పెద్దఎత్తున చర్చ జరిగింది. అయితే తాము ప్రేమించుకుంటూనే త్వరలో పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్లు కుండబద్దలు కొట్టింది సౌందర్య.
 
నిర్మాతగా, గ్రాఫిక్ డిజైనర్‌గా, దర్శకురాలిగా సౌందర్య తమిళ సినీపరిశ్రమలో కొనసాగుతున్నారు. అయితే కుమార్తెపై ఎంతో ప్రేమ ఉన్న రజినీకాంత్ రెండో పెళ్ళి చేసుకునేందుకు సౌందర్య సిద్ధపడుతున్నా ఏమీ అనడం లేదట. మనసులు కలవనప్పుడు ఎవరైనా ఏం చేస్తారు మరి... అందుకే రజినీకాంత్ సైలెంట్ అయ్యారని అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments