Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహేతర సంబంధం పెట్టుకుంటే మహిళలను శిక్షించరా?

వివాహేతర సంబంధాలకు సంబంధించి ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్‌లో వివాహేతర సంబంధాల్లో మహిళలను శిక్ష పడట్లేదని.. పురుషులే శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు వివాహేతర సంబంధాలకు సంబ

Webdunia
శనివారం, 9 డిశెంబరు 2017 (10:51 IST)
వివాహేతర సంబంధాలకు సంబంధించి ప్రజా ప్రయోజన వాజ్యం (పిల్) దాఖలైంది. ఈ పిల్‌లో వివాహేతర సంబంధాల్లో మహిళలను శిక్ష పడట్లేదని.. పురుషులే శిక్ష అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు వివాహేతర సంబంధాలకు సంబంధించి ఐపీసీ సెక్షన్ 497ను సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. 
 
వివరాల్లోకి వెళితే.. భారత సంతతి వ్యక్తి జోసఫ్ షినే (40) దాఖలు చేసిన ఈ పిల్‌లో.. ఐపీసీ 497 సెక్షన్ ప్రకారం ఏ వివాహిత వ్యక్తి అయినా మరో వివాహిత మహిళతో, ఆమె భర్త అనుమతి లేకుండా అక్రమ సంబంధం నెరపితే అది వ్యభిచారంగా పరిగణిస్తారన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న పురుషులకే శిక్ష ఎందుకని ప్రశ్నించారు. 
 
మహిళలకు ఈ వ్యవహారంలో ఎందుకు శిక్ష వుండదు. అందుకే ఈ సెక్షన్ ప్రకారం కేవలం పురుషులనే శిక్షించి.. మహిళలను విడిచిపెట్టడం తగదని.. రాజ్యాంగ విరుద్ధంగా వున్న ఈ సెక్షన్‌ను కొట్టి వేయాలని జోసఫ్ షినే కోర్టును విజ్ఞప్తి చేశారు. ఈ పిల్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments