Webdunia - Bharat's app for daily news and videos

Install App

డేరా బాబా వారసురాలిగా విపశ్యన... ఇక డేరా సచ్ఛా సౌదాకు చీఫ్ ఆమేనా?

అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక డేరా చీఫ్‌ను దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. అత్యాచారం కేసులో డేరా సచ్ఛా సౌదా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. కోర్టు తీర్ప

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (09:12 IST)
అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ ప్రత్యేక డేరా చీఫ్‌ను దోషిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. అత్యాచారం కేసులో డేరా సచ్ఛా సౌదా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు కోర్టు సోమవారం శిక్ష ఖరారు చేయనుంది. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం గుర్మీత్ రామ్ రహీంను హెలికాప్టర్‌లో రోహతక్ జైలుకు తరలించారు. తీర్పు వెలువడిన తరువాత పంజాబ్, హర్యానా రాష్ట్రాలలో గుర్మీత్ అనుచరులు సృష్టించిన విధ్వంసకాండలో 39 మంది మరణించగా, భారీగా ఆస్తుల ధ్వంసం జరిగిన సంగతి తెలిసిందే.
 
ఇదిలా ఉంటే.. సాధ్వీలతో సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ కేసులో గుర్మీత్ రామ్‌రహీం దోషిగా నిర్థారణ అయిన నేపథ్యంలో కేసు పలు మలుపులు తిరుగుతోంది.  కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. అలాగే రామ్ రహీం జైలుకు వెళ్లిన పక్షంలో ‘డేరా’కు చెందిన ఆస్తులకు వారసులు ఎవరు? వాటిని ఎవరు పర్యవేక్షిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.
 
డేరా జాబితాలో రామ్ రహీం కుమారుడు, కుమార్తెలతో పాటు కొత్తగా మరో యువతి పేరు జతచేరింది. 35 సంవత్సరాల విపశ్యన ఇన్సా అనే యువతే డేరా పర్యవేక్షకురాలనే వార్త వినిపిస్తోంది. విపశ్యన ఆశ్రమానికి చెందిన ఒక సాధ్వి. ఆమెను గురు బ్రహ్మచారి విపశ్యన పేరుతో పిలుస్తుంటారు.
 
ఈమె గుర్మీత్ రామ్ రహీం తరువాత డేరాలో ద్వితీయ స్థానంలో ఉన్నారు. ఈమెకు రామ్ రహీం తరపున అన్నినిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది. పంచకూలలో హింస చెలరేగిన అనంతరం విపశ్యన తన ట్విట్టర్ ఖాతాలో ప్రజలు హింసకు పాల్పడకూడదని పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం