Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోతుల్లాగా మెదడును వాడితే ఇంతే.. దొంగ బాబాలు పుడతారు: ట్వింకిల్ ఖన్నా

కోతుల్లాగా మన మెదడును వాడితే ఇలాగే ఉంటుందని.. బాలీవుడ్ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా అన్నారు. డేరా సచ్ఛా సౌదా చీఫ్, బాబా గుర్మీత్‌ రాంరహీం సింగ్‌ దోషిగా తేలడంపై ఆమె స్పందిస్తూ.. మెదడును కోతిలా వాడితే ఇలా

కోతుల్లాగా మెదడును వాడితే ఇంతే.. దొంగ బాబాలు పుడతారు: ట్వింకిల్ ఖన్నా
, ఆదివారం, 27 ఆగస్టు 2017 (17:46 IST)
కోతుల్లాగా మన మెదడును వాడితే ఇలాగే ఉంటుందని.. బాలీవుడ్ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా అన్నారు. డేరా సచ్ఛా సౌదా చీఫ్, బాబా గుర్మీత్‌ రాంరహీం సింగ్‌ దోషిగా తేలడంపై ఆమె స్పందిస్తూ.. మెదడును కోతిలా వాడితే ఇలాగే ఉంటుందని, బాబాలు ఇలాగే మోసాలకు పాల్పడతారన్నారు. ఎంతో తెలివైన వాళ్లు సైతం తమను రక్షిస్తాడంటూ నమ్మి గుర్మిత్ వద్దకు వెళ్లి ఉంటారన్నారు. చెడు పనులు చేసే వారిని, దొంగ స్వామీజీలను కొంతకాలానికే గుర్తుపట్టే అవకాశం ఉందని పిలుపునిచ్చారు.
 
ఇకనైనా మనలో మార్పు వస్తే మంచిదన్నారు. సూర్యుడి వైపు పొద్దుతిరుగుడు పువ్వు ఎలాగైతే మళ్లి ఉంటుందో, అదే తీరుగా జనాలు దొంగ ప్రజల చుట్టూ తిరుగుతుంటారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సీబీఐ కోర్టు గుర్మీత్ ను ఇటీవల దోషీగా ప్రకటించిన అనంతరం డేరాలు చెలరేగి చేసిన దాడులలో 36 మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరమని ట్వింకిల్ ఖన్నా అన్నారు.
 
కాగా గుర్మీత్‌పై అత్యాచారం, హత్య కేసులు 2002లో నమోదు అయ్యాయి. అత్యాచారం కేసులో పంచకుల సీబీఐ కోర్టు గుర్మీత్ రామ్‌ను దోషిగా నిర్ధారిస్తూ ఆగస్టు 25, 2017న తీర్పునిచ్చింది. ఆగస్టు 28న ఆయనకు కోర్టు శిక్షను ఖరారు చేయనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాబోయే కురుక్షేత్ర సంగ్రామానికి నంద్యాల, కాకినాడ ఎన్నికలే నాంది కావాలి: జగన్