Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రిపుల్ తలాక్‌‌పై వాదనలు.. శని, ఆదివారాలు పనిచేయనున్న సుప్రీం కోర్టు

ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో ట్రిపుల్ తలాక్‌పై ముస్లిం మహిళల నిరసన రోజురోజుకీ పెరిగుతోంది. ట్రిపుల్ తలాక్ నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతూ మస్లిం మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహ

Webdunia
గురువారం, 11 మే 2017 (10:27 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిలో ట్రిపుల్ తలాక్‌పై ముస్లిం మహిళల నిరసన రోజురోజుకీ పెరిగుతోంది. ట్రిపుల్ తలాక్ నుంచి తమకు విముక్తి కల్పించాలని కోరుతూ మస్లిం మహిళా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలంతా ఇక్కడి హనుమాన్ ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించారు. ఈ నేపథ్యంలో ట్రిపుల్ తలాఖ్‌పై గురువారం నుంచి సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విననుంది. 
 
ఇస్లాంలో బహుభార్యత్వం, ట్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి వాటికి రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతోకూడిన రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విననుంది. సున్నితమైన ఈ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించే దిశగా.. వేసవి సెలవులైనప్పటికీ శని, ఆదివారాల్లో కోర్టు పనిచేయాలని నిర్ణయించుకుంది. 
 
కాగా, ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ విరుద్ధమని, ఈ విధానం తమ సామాజిక వర్గంలో విపరీతంగా పెరిగిపోతోందని ఐదుగురు ముస్లిం మహిళలతో సహా మొత్తం ఏడుగురు పిటిషన్లు దాఖలు చేశారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments