Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహిళ పట్ల జమ్మూ పోలీసుల వేధింపులు.. జననాంగంలో బీరుబాటిల్ పెట్టి.. మిర్చి పౌడర్ పోశారు..

ఉగ్రవాదులను ఏమీ చేయలేని జమ్మూకాశ్మీర్ పోలీసులు పని మనిషిపై వీరంగం సృష్టించారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా జమ్మూ పోలీసులు ప్రవర్తించారు. ఉగ్రవాదులను ఏమీ చేయలేని జమ్మూపోలీసులు ఒక ఇంట్లో పని మ

Webdunia
గురువారం, 11 మే 2017 (10:00 IST)
ఉగ్రవాదులను ఏమీ చేయలేని జమ్మూకాశ్మీర్ పోలీసులు పని మనిషిపై వీరంగం సృష్టించారు. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా జమ్మూ పోలీసులు ప్రవర్తించారు. ఉగ్రవాదులను ఏమీ చేయలేని జమ్మూపోలీసులు ఒక ఇంట్లో పని మనిషిగా పనిచేసే మహిళపై తమ ప్రతాపం చూపారు. థర్డ్ డిగ్రీ కంటే దారుణమైన హింసా పద్ధతులను వినియోగించారని బాధిత వివాహిత (28) బోరున విలపించింది. తన జననాంగంలో బీరుబాటిల్ పెట్టి, మిర్చి పౌడర్ పోశారని కన్నీరు మున్నీరైంది. 
 
వివరాల్లోకి వెళితే.. జమ్మూ పట్టణంలోని దోమనా ప్రాంతంలోని ఓ ఇంట్లో పనిమనిషిగా ఉంటున్న బాధిత మహిళ ఇటీవల పని మానేసింది. ఈ నేపథ్యంలో ఆ ఇంటి యజమాని ఏప్రిల్ 30న నగలు చోరీ చేసిందని ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాలుగు రోజుల క్రితం కెనాల్ రోడ్డులోని పోలీసుస్టేషనుకు ఆమెను తీసుకొచ్చిన జమ్మూ పోలీసులు ఆమెకు నరకం చూపించారు. 
 
తాను నేరం చేయలేదని, తాను పని మానేయడం వల్లే యజమాని తప్పుడు కేసుపెట్టాడని ఎంత మొత్తుకున్నా పోలీసులు వినిపించుకోలేదు. ఈ ఘటనపై కోర్టును ఆశ్రయించడంతో ఆమె చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని.. కోర్టు ఆదేశాలు జారీచేసింది. దీనిపై న్యాయ విచారణ కూడా జరుగుతోంది.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం