Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిండు గర్భిణి అనే కనికరం లేదు.. పొట్టపైనే కొట్టిన బీజేపీ నేత.. గర్భస్థ శిశువు మరణించింది..

నిండు గర్భిణీ అని కూడా చూడలేదు. బీజేపీ నాయకుడే కాదు.. ఆయనతో పాటు ఐదుగురు వ్యక్తులు నిండు గర్భిణీని పొట్టపై కొట్టిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కృష్ణ నగర్‌లో చోటుచేసుకుంది.

Webdunia
గురువారం, 23 ఫిబ్రవరి 2017 (10:25 IST)
నిండు గర్భిణీ అని కూడా చూడలేదు. బీజేపీ నాయకుడే కాదు.. ఆయనతో పాటు ఐదుగురు వ్యక్తులు నిండు గర్భిణీని పొట్టపై కొట్టిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కృష్ణ నగర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. నడియా జిల్లాలోని దుబులియా పోలీసుస్టేషను పరిధిలోని తంత్లా గ్రామానికి చెందిన శంబుచంద్ర దాస్ అనే వ్యక్తి కీర్తనలను అధిక సౌండుతో పెట్టాడు. దీనిపై ఫైర్ అయిన స్థానిక బీజేపీ పంచాయతీ ప్రధాన్ పలాస్ కుమార్ బిస్వాస్ తోపాటు నలుగురు వ్యక్తులు వచ్చి దాస్‌పై దాడికి దిగారు. దాస్‌ను కొడుతుండటంతో అతని సోదరి మాయారాణి (గర్భిణీ) అడ్డుకునేందుకు ప్రయత్నించింది. 
 
అంతే ఆగ్రహించిన దుండగులు గర్భవతి అని కూడా చూడకుండా ఆమె పొట్టపై కొట్టారు. దీంతో గర్భస్థ శిశువు మరణించాడు. ఆస్పత్రిలో ప్రస్తుతం మాయారాణి చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై బీజేపీ ప్రధాన్ బిస్వాస్ తోపాటు నలుగురిపై దాస్ ఫిర్యాదు చేశాడు. దీంతో నిందితులైన ఐదుగురిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం