Webdunia - Bharat's app for daily news and videos

Install App

లంచం ఇవ్వలేదనీ స్కూటరిస్టును చంపేసిన బెంగాల్ పోలీసులు

హెల్మెట్ ధరించలేదంటూ లంచం అడిగారు. కానీ ఆయన లంచం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ స్కూటరిస్టును వెస్ట్ బెంగాల్ సివిక్ పోలీస్ వాలంటీర్లు చంపేశారు.

Webdunia
ఆదివారం, 21 జనవరి 2018 (17:31 IST)
హెల్మెట్ ధరించలేదంటూ లంచం అడిగారు. కానీ ఆయన లంచం ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఆ స్కూటరిస్టును వెస్ట్ బెంగాల్ సివిక్ పోలీస్ వాలంటీర్లు చంపేశారు. ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని రద్దీ కూడలిలో శనివారం ఉదయం 11 గంటల సమయంలో సౌమెన్ దేబ్‌నాథ్ (49) హెల్మెట్ ధరించకుండా బైక్‌పై వెళ్తున్నాడు. దీన్ని గుర్తించిన బెంగాల్ సివిక్ పోలీస్ వాలంటీర్లు ఆయనను ఆపారు. హెల్మెట్ ధరించలేదంటూ లంచం అడిగారు. కానీ ఆయన లంచం ఇచ్చేందుకు నిరాకరించారు. 
 
దీంతో వలంటీర్లు ఆయనపై పిడిగుద్దులు కురిపించారు. స్థానికులు ఆయనను కాపాడేందుకు వెళ్ళారు. దీన్ని గమనించిన పోలీసు వాలంటీర్లు పారిపోయారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన దేబ్‌నాథ్‌ను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన ఆసుపత్రిలో మరణించారు. దీంతో మధ్యమ్‌గ్రామ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. రెగ్యులర్ పోలీస్ సిబ్బంది, సివిక్ పోలీస్ వలంటీర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments