Webdunia - Bharat's app for daily news and videos

Install App

బెంగాల్‌లో వందే భారత్ రైలుపై అగంతకుల రాళ్లదాడి

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (08:54 IST)
ఇటీవల వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో వందే భారత్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ రైలు హౌరా వెళ్తుండగా కొందరు దుండగులు రాళ్లు రువ్వారు. దీంతో రైలు కిటికీ అద్దాలు ధ్వంసమయ్యాయి. మల్దాలోని కుమార్‌గండ్ స్టేషన్‌‍లో ఈ ఘటన జరిగింది. 
 
డిసెంబరు 30వ తేదీన వెస్ట్ బెగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సమక్షంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రైలును వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది దేశంలో ఏడో వందే భారత్ రైలు. హౌరా - న్యూజుల్పాయిగురి స్టేషన్ల మధ్య నడుస్తుంది. అయితే, ఈ రైలును పట్టాలెక్కించిన నాలుగు రోజుల్లోనే అగంతకులు ఈ రైలుపై రాళ్లదాడి చేశారు. ముఖ్యంగా ప్రయాణికులతో తొలి ప్రయాణం ప్రారంభించిన రోజే ఈ దాడి జరగడం గమనార్హం. 
 
రైలు కుమార్‌గంజ్ స్టేషన్ దాటుతున్న సమయంలో దాడి జరిగినట్టు ఈస్టర్న్ రైల్వే తెలిపింది. రైలు మల్దా స్టేషన్‌కు చేరుకోవడానికి ముందు ఈ ఘటన జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. అయితే, ఈ దాడిలో రైలులోని ప్రయాణికులకు ఎలాంటి గాయాలా కాలేదు. ఈ దాడి ఎవరు చేశారు.. ఎందుకు చేశారన్న కోణంలో ఈస్టర్న్ రైల్వే అధికారులు విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజ్ తరుణ్-లావణ్య కేసు- హార్డ్ డిస్క్‌లో 200కి పైగా వీడియోలు

ఎండ్‌కార్డు వరకు సస్పెన్స్ కొనసాగుతుంది - 'ఒక పథకం ప్రకారం' డైరెక్టర్ వినోద్ కుమార్ విజయన్

లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో 'సతి లీలావతి'

'గేమ్ ఛేంజర్' కలెక్షన్లపై అల్లు అరవింద్ సెటైర్లు - ముందుంది మొసళ్ల పండుగ అంటున్న మెగాఫ్యాన్స్!

ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ అర్చన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

2025 వెడ్డింగ్ కలెక్షన్‌ను లాంచ్ చేసిన తస్వ ఎక్స్ తరుణ్ తహిలియాని

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments