ఏం మొగుడురా బాబూ : కట్నం కింద భార్య కిడ్నీ అమ్మేశాడు...

వివాహ సమయంలో అడిగినంత కట్నం ఇవ్వక పోతే.. పెళ్లి పీటలపై పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకవేళ ముహుర్త సమయానికి పెళ్లిళ్లు జరిగినప్పటికీ ఆ తర్వాత వరకట్న వేధింపులనేవి ఉంటాయి.

Webdunia
మంగళవారం, 17 జులై 2018 (18:00 IST)
వివాహ సమయంలో అడిగినంత కట్నం ఇవ్వక పోతే.. పెళ్లి పీటలపై పెళ్లిళ్లు ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకవేళ ముహుర్త సమయానికి పెళ్లిళ్లు జరిగినప్పటికీ ఆ తర్వాత వరకట్న వేధింపులనేవి ఉంటాయి. అయితే, ఈ భర్త మాత్రం మిగిలినవారికి భిన్నం. కట్నం కింద ఏకంగా భార్య కిడ్నీనే అమ్మేశాడు. అదికూడా 12 ఏళ్ల తర్వాత. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకుంది.
 
కోల్‌క‌తాకు చెందిన బిస్వజిత్‌ అనే వ్యక్తికి.. రీటా అనే యువతితో 12 ఏళ్ల కిందట పెళ్లి జరిగింది. కట్నంగా ఇస్తామన్న 2 లక్షల రూపాయలను అత్తింటివారు ఇవ్వలేదు. ఈ కట్నం కోసం భార్యను పుష్కరకాలంగా వేధిస్తూనే వచ్చాడు. అయినా రీటా తల్లిదండ్రులు డబ్బు సర్దుబాటు చేయలేకపోయారు. దీంతో ఇక తనకు కట్నం ఇవ్వరని డిసైడ్ అయిన శాడిస్ట్ భర్త... ఓ ప్లాన్ వేశాడు. ఈ ప్లాన్‌లో భాగంగా తన భార్య కిడ్నీని అమ్మేశాడు. 
 
ఇది రెండేళ్ళ క్రితం జరిగింది. ఆ సమయంలో రీటాకు కడుపునొప్పి రావడంతో భర్త బిస్వజిత్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పట్లో తీవ్ర కడుపునొప్పి అని.. అపెండిక్స్ ఆపరేషన్ చేశారని చెప్పాడు. అప్పట్లో నిజమే అని అందరూ అనుకున్నారు.
 
ఇటీవల రీటాకి మళ్లీ తీవ్ర నొప్పి వచ్చింది. బంధువులు ఉత్తర బెంగాల్ మెడికల్ కళాశాల, ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు... కుడి వైపు కిడ్నీ లేదని చెప్పి షాకిచ్చారు. ఆ తర్వాత తన భర్తను నిలదీసింది. అప్పుడు అసలు విషయం చెప్పాడు. రెండేళ్ల క్రితం అపెండిక్స్ ఆపరేషన్ అని చెప్పింది అబద్ధమనీ, అపుడు కిడ్నీ తీసుకుని అమ్మేసుకున్నాని అని చెప్పాడు. కట్నం కింద జమ చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. 
 
దీంతో చిర్రెత్తుకొచ్చిన భార్య.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్త బిస్వజిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. సర్జరీ చేసిన ఆస్పత్రిపై దాడులు చేశారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్తకు కిడ్నీ అమ్మేసినట్టు బిస్వజిత్‌ నేరాన్నిఅంగీకరించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments