Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్జిలింగ్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు... నలుగురి మృతి?

వరుణ్
సోమవారం, 17 జూన్ 2024 (10:41 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రలోని డార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌కతా వెళ్తున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనక నుంచి వచ్చిన గూడ్స్‌ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. న్యూ జల్‌పాయ్‌గురి నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైలు బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. సిగ్నల్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. 
 
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ వెళుతున్న ట్రాక్‌పై వెనుక నుంచి వచ్చిన గూడ్సు రైలు ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ రెండు రైళ్లు ఢీకొనడంతో పలు బోగీలు గాల్లోకి లేచిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా లేదా అన్నది తెలియాల్సివుంది. మరోవైపు, క్షతగాత్రులను రక్షించి సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ప్రాథమిక సమాచారం మేరకు నలుగురు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కల్కిలో అర్జునుడుగా విజయ్ దేవరకొండ.... తన పాత్రపై తొలిసారి స్పందన

తీవ్ర జ్వరంతో ఆస్పత్రి పాలైన బాలీవుడ్ నటుడు శత్రుఘ్న సిన్హా

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన మళ్లీ టిల్లు స్క్వేర్ హీరోయిన్

బాక్సాఫీస్ వద్ద 'కల్కి' కలెక్షన్ల వర్షం.. 4 రోజుల్లో రూ.500 కోట్ల కలెక్షన్లు!!

మొండి వైఖరితో బచ్చల మల్లి లో అల్లరి నరేష్ ఎం చేసాడు ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తదానం చేస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

గుమ్మడి విత్తనాలు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్‌కు విజయవాడలోని అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతంగా చికిత్స

దానిమ్మ కాయలు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

అలాంటి మగవారికి అశ్వగంధ లేహ్యంతో అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments