Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్జిలింగ్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు... నలుగురి మృతి?

వరుణ్
సోమవారం, 17 జూన్ 2024 (10:41 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రలోని డార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌కతా వెళ్తున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనక నుంచి వచ్చిన గూడ్స్‌ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. న్యూ జల్‌పాయ్‌గురి నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైలు బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. సిగ్నల్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. 
 
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ వెళుతున్న ట్రాక్‌పై వెనుక నుంచి వచ్చిన గూడ్సు రైలు ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ రెండు రైళ్లు ఢీకొనడంతో పలు బోగీలు గాల్లోకి లేచిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా లేదా అన్నది తెలియాల్సివుంది. మరోవైపు, క్షతగాత్రులను రక్షించి సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ప్రాథమిక సమాచారం మేరకు నలుగురు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Warner: క్రికెట్‌లో స్లెడ్జింగ్‌ కంటే ఆ కామెంట్స్ పెద్దవేమీ కాదు.. లైట్‌గా తీసుకున్న వార్నర్.. వెంకీ

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments