Webdunia - Bharat's app for daily news and videos

Install App

డార్జిలింగ్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఢీకొన్న రెండు రైళ్లు... నలుగురి మృతి?

వరుణ్
సోమవారం, 17 జూన్ 2024 (10:41 IST)
వెస్ట్ బెంగాల్ రాష్ట్రలోని డార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కోల్‌కతా వెళ్తున్న కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనక నుంచి వచ్చిన గూడ్స్‌ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. న్యూ జల్‌పాయ్‌గురి నుంచి ఎక్స్‌ప్రెస్‌ రైలు బయల్దేరిన కాసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం. సిగ్నల్ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. 
 
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ వెళుతున్న ట్రాక్‌పై వెనుక నుంచి వచ్చిన గూడ్సు రైలు ఈ ప్రమాదానికి కారణమైంది. ఈ రెండు రైళ్లు ఢీకొనడంతో పలు బోగీలు గాల్లోకి లేచిపోయాయి. ఈ ప్రమాదంలో ఎవరైనా చనిపోయారా లేదా అన్నది తెలియాల్సివుంది. మరోవైపు, క్షతగాత్రులను రక్షించి సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే ప్రాథమిక సమాచారం మేరకు నలుగురు చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

Saptami: పవన్ కల్యాణ్ అభిమానిని, తెరపై నేను కనిపించకపోవడానికి కారణమదే : సప్తమి గౌడ

రానా దగ్గుబాటి, ప్రవీణ పరుచూరి కాంబినేషన్ లో కొత్తపల్లిలో ఒకప్పుడు

Shankar:రామ్ చరణ్ తో సినిమా తీయబోతున్నా: దిల్ రాజు, దర్శకుడు శంకర్ పై శిరీష్ ఫైర్

Nitin: సక్సెస్ ఇవ్వలేకపోయా : నితిన్; తమ్ముడుతో సక్సెస్ ఇస్తావ్ : దిల్ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments