Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్న చనిపోయాడని వదినను పెళ్లాడిన యువకుడి హత్య.. ఎక్కడ?

murder

వరుణ్

, ఆదివారం, 16 జూన్ 2024 (09:23 IST)
ఉత్తప్రదేశ్ రాష్ట్రంలో ఓ దారుణం జరిగింది. అన్న చనిపోయిన తర్వాత విధవగా మారిన తన వదినను వివాహం చేసుకున్న యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ చర్య ఆ కుటుంబంలోని ఇతర సోదరులకు ఏమాత్రం నచ్చకోపవడంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బాగ్‌పత్ గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే వ్యక్తికి సుఖ్‌వీర్, ఓంవీర్, ఉదయ్ వీర్, యశ్‌వీర్ అనే నలుగురు కునమారులు ఉన్నారు. వీరిలో పెద్దవాడైన సుఖ్‌వీర్ గత యేడాది చనిపోయాడు. ఈ క్రమంలో అతని భార్య.. సోదరుల్లో అందరికంటే చిన్నవాడైన యశ్‌వీర్‌ను పెళ్లి చేసుకుంది. ఇది మిగిలిన ఇద్దరు సోదరులకు ఏమాత్రం నచ్చలేదు. అప్పటి నుంచిం వారి కుటుంబంలో తరచుగా గొడవలు ప్రారంభమయ్యాయి. 
 
అయితే, ఇవేమీ పట్టించుకోని యశ్‌వీర్ తాను మాత్రం తన విధుల్లో నిమగ్నమైపోయాడు. ఈ క్రమంలో ఢిల్లీలో డ్రైవర్‌గా పని చేసే యశ్‌వీర్.. శుక్రవారం రాత్రి తన విధులను ముగించుకుని ఇంటికొచ్చాడు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న మిగిలిన ఇద్దరు సోదరులు.. తమ తల్లితో వాగ్వాదానికి దిగారు. యశ్‌వీర్ రాకతో ఈ వివాదం మరింతగా ముదిరింది. దీంతో విచక్షణ కోల్పోయిన ఇద్దరు సోదరులు.. తమ్ముడు అని కూడా చూడకుండా యశ్‌వీర్‌ను తుపాకీతో కాల్చి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు... సంఘటనా స్థలానికి చేరుకుని కాల్పులకు పాల్పడిన ఓంవీర్, ఉదయ్ వీర్‌లను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వచ్చే 12 నెలల్లో నిఫ్టీ 25,816కి చేరుతుందని అంచనా: ప్రభుదాస్ లీలాధర్