Webdunia - Bharat's app for daily news and videos

Install App

జయలలిత వల్లే మాకు ఈ కష్టాలు : దివాకరన్

తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత మన్నార్గుడి మాఫియా ఎక్కడలేని కష్టాలను అనుభవిస్తోంది. ముఖ్యంగా, శశికళ కుటుంబ సభ్యులు కష్టాలు అన్నీఇన్నీకావు. ఈ కష్టాలపై శశికళ సోదరుడు దివాకరన్ స్పందించారు

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (13:58 IST)
తమిళనాడు ముఖ్యమంత్రి దివంగత జయలలిత మరణం తర్వాత మన్నార్గుడి మాఫియా ఎక్కడలేని కష్టాలను అనుభవిస్తోంది. ముఖ్యంగా, శశికళ కుటుంబ సభ్యులు కష్టాలు అన్నీఇన్నీకావు. ఈ కష్టాలపై శశికళ సోదరుడు దివాకరన్ స్పందించారు.
 
తమిళనాట తమపై వరుసగా జరుగుతున్న దాడులకు జయలలితే కారణమని ఆరోపించారు. తాను మరణించిన తర్వాత శశికళ పరిస్థితి ఏంటన్న విషయాన్ని జయలలిత ఎంతమాత్రమూ పట్టించుకోలేదని, అందువల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు.
 
జయలలిత తప్పిదాలే తమ పాలిట శాపాలుగా మారాయని ఆరోపించారు. శశికళను పూర్తిగా వాడుకున్న జయలలిత, ఆమె క్షేమం కోసం ఏమీ చేయలేదని, ఫలితంగానే ఆమె ఇపుడు జైల్లో మగ్గుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
 
శశికళ కుటుంబీకులు చేసిన మోసం కారణంగానే జయలలితపై కేసు నమోదైందని వస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, అదే జరిగి, మేమే అమ్మను మోసం చేసుంటే, ఆమె దోషిగా ఎలా తేలిందని మీడియాను దినకరన్ ఎదురు ప్రశ్నించారు. జయలలిత మరణం తర్వాత తమ కుటుంబానికి కష్టాలు వచ్చాయన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నాడు.
 
'అమ్మ'తో కలిసున్న కారణంగానే శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు జైల్లో మగ్గాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అక్రమాస్తుల కేసులో ప్రధాన ముద్దాయి అమ్మేననే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలంటూ సూచన చేశారు. 

సంబంధిత వార్తలు

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

విక్రాంత్, చాందినీ చౌదరి జంటకు సంతాన ప్రాప్తిరస్తు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments