Webdunia - Bharat's app for daily news and videos

Install App

అపరాధం చెల్లించిన న్యాయవాది.. ఒకటి రెండు రోజుల్లో శశికళ రిలీజ్!

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (09:24 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే శాశ్వత ప్రధాన కార్యదర్శి జయలలిత అక్రమాస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ నటరాజన్... త్వరలోనే జైలు నుంచి విడుదలకానున్నారు. ఈమెకు కోర్టు విధించిన రూ.10.10 కోట్ల అపరాధాన్ని ఆమె తరపు న్యాయవాది చెందూర్ పాండ్యన్ చెల్లించారు. దీంతో శశికళ రిలీజ్ కావడం ఖాయమైపోయింది. 
 
ఈ అక్రమాస్తుల కేసులో జయలలితతో పాటు శశికళ, జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్‌లకు ప్రత్యేక కోర్టు జైలుశిక్ష విధించింది. అయితే, జయలలిత మరణించడంతో, ఈ కేసులో ముద్దాయిలుగా తేలిన మిగిలిన ఇద్దరూ బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో కోర్టుకు చెల్లించాల్సిన రూ.10.10 కోట్ల జరిమానాను కోర్టుకు చెల్లించిన ఆమె తరపు న్యాయవాదులు, అందుకు సంబంధించిన రసీదును శిశికళ ఉంటున్న పరప్పణ అగ్రహార జైలు అధికారులకు పంపించారు. దీంతో ఆమె విడుదలకు మార్గం సుగమం అయింది.
 
శశికళ తరపు న్యాయవాది రాజా చెందూర్ పాండ్యన్ జరిమానాగా చెల్లించాల్సిన రూ.10.10 కోట్లను డీడీ రూపంలో న్యాయమూర్తికి అందించారు. అన్ని ప్రక్రియలు సజావుగానే సాగుతున్నాయని, ఒకటి రెండు రోజుల్లో చిన్నమ్మ విడుదల కావచ్చని ఆమె తరపు న్యాయవాది పాండ్యన్ ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు, శశికళ జైలు నుంచి విడుదలైనంత మాత్రాన అన్నాడీఎంకేలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోవని సీఎం ఎడప్పాడి పళనిస్వామి పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments