Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమ్ముకాశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్‌

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (08:55 IST)
జమ్ముకాశ్మీర్‌లో భద్రతా సిబ్బందికి, ఉగ్రవాదులకు మధ్య రెండు గంటలపాటు ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

గురువారం తెల్లవారుజామున ఐదుగంటల సమయంలో జమ్ము-శ్రీనగర్‌ రహదారిపై నగ్రోటాలోని బాన్‌ టోల్‌ప్లాజా సమీపంలో భద్రతా దళాలపై కొందరు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు జమ్మూ జిల్లా పోలీస్‌ చీఫ్‌ ఎస్‌ఎస్‌పి.శ్రీధర్‌ పాటిల్‌ తెలిపారు. ఒక వాహనంలో వచ్చిన నలుగురు ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారని అన్నారు.

దీంతో టోల్‌ప్లాజాను మూసివేసి, భారీ సంఖ్యలో సైనికులను మోహరించామని చెప్పారు. ఈ ఏడాది జనవరి 31న కూడా ఇదే తరహాలో ఉగ్రవాదులు దాడి చేశారని రక్షణశాఖ ప్రతినిధి లెఫ్టెనెంట్‌ కల్నల్‌ దేవేందర్‌ ఆనందర్‌ తెలిపారు.

జనవరి 31న కొందరు ఉగ్రవాదులు బాన్‌టోల్‌ప్లాజా సమీపంలోని భద్రతాదళాలపై విరుచుకుపడ్డారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా, ఒక జవానుకు గాయాలైన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments