Webdunia - Bharat's app for daily news and videos

Install App

వి.కె శశికళపై మరో కేసు.. మళ్లీ పార్టీలోకి అన్నాడీఎంకేలోకి ఎంట్రీ

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (17:23 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి వి.కె శశికళపై మరో కేసు నమోదైంది. అన్నాడీఎంకే నేతను బెదిరించారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి సీవీ షణ్ముగానికి.. శశికళ మద్దతుదారుల నుంచి చంపేస్తానని బెదిరింపులు వస్తున్నాయని పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుపై విచారించిన విల్లుపురం జిల్లా పోలీసులు శశికళపై పలు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు.
 
కొన్నేళ్ల క్రితం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ.. ఇప్పుడు మళ్లీ పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా కొందరు నేతలు, కార్యకర్తల మద్దతును కూడా ఆమె కూడగట్టుకున్నారు. అన్నాడీఎంకేపై కోల్పోయిన పట్టును తిరిగి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.
 
జైలు నుంచి వచ్చిన తరువాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏప్రిల్ 6న రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది శశికళ. అయితే ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోరంగా ఓటమి పాలవడం.. గొడవలతో పార్టీ నాశనమవ్వడాన్ని తాను చూడలేనని శశికళ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments