Webdunia - Bharat's app for daily news and videos

Install App

వి.కె శశికళపై మరో కేసు.. మళ్లీ పార్టీలోకి అన్నాడీఎంకేలోకి ఎంట్రీ

Webdunia
బుధవారం, 30 జూన్ 2021 (17:23 IST)
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత నెచ్చెలి వి.కె శశికళపై మరో కేసు నమోదైంది. అన్నాడీఎంకే నేతను బెదిరించారన్న ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి సీవీ షణ్ముగానికి.. శశికళ మద్దతుదారుల నుంచి చంపేస్తానని బెదిరింపులు వస్తున్నాయని పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుపై విచారించిన విల్లుపురం జిల్లా పోలీసులు శశికళపై పలు సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేశారు.
 
కొన్నేళ్ల క్రితం అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన శశికళ.. ఇప్పుడు మళ్లీ పార్టీలో చేరాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దిశగా కొందరు నేతలు, కార్యకర్తల మద్దతును కూడా ఆమె కూడగట్టుకున్నారు. అన్నాడీఎంకేపై కోల్పోయిన పట్టును తిరిగి సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు.
 
జైలు నుంచి వచ్చిన తరువాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏప్రిల్ 6న రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించింది శశికళ. అయితే ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘోరంగా ఓటమి పాలవడం.. గొడవలతో పార్టీ నాశనమవ్వడాన్ని తాను చూడలేనని శశికళ అన్నారు.

సంబంధిత వార్తలు

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments