Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసలే ఓపెన్ టాప్ జీప్.. పులి వెంబడించింది.. డ్రైవర్ వేగం పెంచకపోయుంటే..?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (15:32 IST)
మహారాష్ట్రలో పర్యాటకులను పులి వెంబడించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అడవిలో షికారుకు వెళ్లిన పర్యాటకుల వాహనాన్ని పులి వెంబడించింది. అంతే అందులోని పర్యాటకులు భయంతో కేకలు వేశారు. 
 
వాహనానికి, పులికి మధ్య దూరం కొన్ని అడుగులు మాత్రమే ఉండడం, వాహనం ఓపెన్ టాప్ కావడంతో పర్యాటకులకు చుక్కలు కనిపించాయి. కానీ డ్రైవర్ వేగం పెంచేయడంతో పర్యాటకులు సురక్షితంగా తప్పించుకోగలిగారు.
 
ఇలాంటి ఘటనలు టైగర్ రిజర్వ్‌లో కొత్తేమీ కాదని.. పర్యాటకుల వాహనం మరీ దగ్గరగా రావడంతో మూడున్నరేళ్ల చోటీ మధు అనే పులి ఆందోళనతో వారి వాహనాన్ని వెంబడించిందని రేంజ్ ఫారెస్ట్ అధికారి రాఘవేంద్ర చెప్పారు. పులులు ఉండే ప్రదేశానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని డ్రైవర్లకు సూచించారు. ఘటనకు కారణమైన రహదారిని వారం రోజులపాటు మూసి వేస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments