అసలే ఓపెన్ టాప్ జీప్.. పులి వెంబడించింది.. డ్రైవర్ వేగం పెంచకపోయుంటే..?

Webdunia
బుధవారం, 14 నవంబరు 2018 (15:32 IST)
మహారాష్ట్రలో పర్యాటకులను పులి వెంబడించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా-అంధారీ టైగర్ రిజర్వ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. అడవిలో షికారుకు వెళ్లిన పర్యాటకుల వాహనాన్ని పులి వెంబడించింది. అంతే అందులోని పర్యాటకులు భయంతో కేకలు వేశారు. 
 
వాహనానికి, పులికి మధ్య దూరం కొన్ని అడుగులు మాత్రమే ఉండడం, వాహనం ఓపెన్ టాప్ కావడంతో పర్యాటకులకు చుక్కలు కనిపించాయి. కానీ డ్రైవర్ వేగం పెంచేయడంతో పర్యాటకులు సురక్షితంగా తప్పించుకోగలిగారు.
 
ఇలాంటి ఘటనలు టైగర్ రిజర్వ్‌లో కొత్తేమీ కాదని.. పర్యాటకుల వాహనం మరీ దగ్గరగా రావడంతో మూడున్నరేళ్ల చోటీ మధు అనే పులి ఆందోళనతో వారి వాహనాన్ని వెంబడించిందని రేంజ్ ఫారెస్ట్ అధికారి రాఘవేంద్ర చెప్పారు. పులులు ఉండే ప్రదేశానికి వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని డ్రైవర్లకు సూచించారు. ఘటనకు కారణమైన రహదారిని వారం రోజులపాటు మూసి వేస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments