Webdunia - Bharat's app for daily news and videos

Install App

రక్షా బంధన్ : విష సర్పాలకు రాఖీ కడుతూ ప్రాణాలు కోల్పోయాడు..

Webdunia
మంగళవారం, 24 ఆగస్టు 2021 (08:39 IST)
రక్షా బంధన్ అంటే.. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక. కానీ, ఇక్కడో వ్యక్తి విచిత్రంగా ప్రవర్తించాడు. విష సర్పాలకు రాఖీ కడుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర ఘటన బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బీహార్ రాష్ట్రంలోని సరన్ జిల్లా మాంజీ సీతల్ పూర్ గ్రామానికి చెందిన మన్మోహన్ అనే వ్యక్తి ఉన్నాడు. ఈయన పాములు పట్టడంలోనూ, పాము కాటుకు గురైన వారికి చికిత్స చేయడంలోనూ ఆ ప్రాంతంలో సుప్రసిద్ధుడు.
 
అయితే, రాఖీ పౌర్ణమి సందర్భంగా రెండు నాగుపాములు తీసుకువచ్చాడు. వాటికి రాఖీలు కట్టేందుకు ప్రయత్నించాడు. అతడు ఏమరుపాటుగా ఉన్న సమయంలో ఓ సర్పం అతడి కాలిపై కాటేసింది. 
 
అయితే, వైద్యం సాయం తీసుకునేలోపే అతని ప్రాణాలు పోయాయి. అతడిని పాము కరిచిన వీడియో సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తోంది. మన్మోహన్ మృతితో అతడి స్వగ్రామంలో విషాదం అలముకుంది.

సంబంధిత వార్తలు

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments