Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూపీ: డెంగ్యూతో 45మంది మృతి.. చిన్నారులే అధికం

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (12:55 IST)
ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో గత పది రోజుల్లో సుమారు 53 మంది మరణించారు. వారిలో 45 మంది చిన్నారులే ఉన్నారు. అయితే వీరంతా డెంగ్యూ వ్యాధితో మరణించినట్లు భావిస్తున్నారు. దీనిపై విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
 
ఫిరోజాబాద్ మెడికల్ కాలేజీ వద్ద చాలా హృదయవిదారక పరిస్థితులు కనిపిస్తున్నాయి. జ్వరంతో బాధపడుతున్న పిల్లలు హాస్పిటళ్లకు పోటెత్తుతున్నారు. చిన్న పిల్లలు వైరల్ జ్వరంతో బాధపడుతున్నారని, కొందరు డెంగ్యూ పరీక్షలో పాజిటివ్‌గా తేలుతున్నట్లు పీడియాట్రిక్‌ డాక్టర్ ఎల్‌కే గుప్తా తెలిపారు.
 
ప్రస్తుతం హాస్పిటల్‌లో 186 మంది చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లను మూసివేయాలని జిల్లా మెజిస్ట్రేట్ చంద్రా విజయ్ సింగ్ ఆదేశించారు. నిన్న ఫిరోజాబాద్ హాస్పిటల్‌ను సీఎం యోగి సందర్శించారు.
 
చాలా మంది పిల్లల్లో కీళ్ల నొప్పులు, తలనొప్పి, డీహైడ్రేషన్‌, మగత లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కొందరు పేషెంట్లలో కాళ్లు, చేతులకు ఎర్రటి దద్దులు వస్తున్నాయి. అయితే మరణించిన వారిలో ఎవరు కూడా కోవిడ్ పాజిటివ్‌గా తేలలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments