Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒకే వేదికపై తల్లీ కూతుళ్ళ వివాహాలు.. మరిదిని పెళ్లాడిన వదిన

Webdunia
శనివారం, 12 డిశెంబరు 2020 (15:20 IST)
తల్లీ కూతుళ్ళ వివాహాలు ఒకే వేదికపై జరిగాయి. సాధారణంగా తోబుట్టువులు లేదా స్నేహితుల పెళ్ళిళ్ళు ఒకే మండపంలో ఒకే వేదికపై జరగడం చూస్తుంటాం.. కానీ ఇలా తల్లి, కూతురు ఒకే వేదికపై వివాహం చేసుకోవడంతో.. అందరూ వీరి వివాహాల గురించే చర్చించుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గోరక్ పూర్ జిల్లాలో ఓ తల్లీ కూతుళ్ళ వివాహాలు ఒకే వేదికపై జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామంలో ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన కింద 63 పెళ్లిళ్లు చేసింది. ఇందులో జగదీష్ అనే వ్యక్తిని బేలాదేవి(53) పెళ్లాడింది. అదే మండపంలో ఆమె కుమార్తె(27) ఇందు వివాహం కూడా జరిగింది. 
 
బేలాదేవి ఆమె భర్త సోదరుడిని వివాహం చేసుకుంది. వితంతువైన బేలాదేవి వివాహం వారి సంతానం అనుమతితోనే జరిగిందని... తన సంతానం ఒత్తిడితోనే తాను వివాహం చేసుకున్నానని.. బేలాదేవి వివాహం తర్వాత మీడియాతో చెప్పింది. అమ్మకు తోడు కావాలనే బాబాయ్‌తో ఆమె వివాహం జరిపించినట్లు బేలాదేవి కూతుళ్లు వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments