Webdunia - Bharat's app for daily news and videos

Install App

వంతెన కింద ఇరుక్కున్న విమానం.. అసలు ఏం జరిగిందంటే?

Webdunia
శనివారం, 30 డిశెంబరు 2023 (10:36 IST)
బీహార్‌లో ఓ ఆశ్చర్యకర సంఘటన ఒకటి జరిగింది. విమానాన్ని మోసుకెళుతున్న లారీ ఒకటి వంతెన కింద చిక్కుకుని పోయింది. దీంతో ఆ మార్గంలో రెండు గంటల పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని తూర్పు చంపారణ్ జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబై నుంచి అస్సాంకు విమానాన్ని తీసుకెళుతున్న ట్రక్కు పిప్రాకోఠి వద్ద ఫ్లైఓవర్ కింద చిక్కుకుని పోయింది. విమానం పైభాగం వంతెనకు తాకడం వల్ల లారీ ఆగిపోయింది. వాహనాన్ని ముందుకు పోనిచ్చేందుకు డ్రైవర్‌ ఎంతగా ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదు. ఫలితంగా 28వ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. విమానం ఇరుక్కుందున్న విషయాన్ని గమనించిన స్థానికులు అక్కడు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 
 
ముంబైలో నిర్వహించిన ఓ వేలంలో ఓ వ్యాపారి విమానాన్ని తుక్కు కింద కొనుగోలు చేశఆరు. దాన్ని ముంబై నుంచి అస్సోంకు తరలిస్తుండగా, ఈ వంతెన కింద చిక్కుకునిపోయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ట్రక్కును చాకచక్యంగా బయటకు తీశారు. టైర్లలో కొంతమేరకు గాలిని తీసేయడంతో లారీ ఎత్తు తగ్గిపోయింది. దీంతో లారీ సులభంగా బయటకు వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అనిరుధ్ తో మ్యాజిక్ చేస్తున్న దర్శకుడు గౌతమ్ తిన్ననూరి

సినిమా టికెట్ ధరలు ఫ్లెక్సిబుల్ విధానమే మేలు: పవన్ కళ్యాణ్ కు విజ్నప్తి

అఖండ 2 తొలి డైలాగ్ - నేలను తాకితే జరిగేది అఖండ తాండవం అన్న బాలక్రిష్ణ

దేవర అద్భుతమైన విజయం పట్ల అందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్‌

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో అఖండ 2 ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలు తింటుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రతిరోజూ రాత్రిపూట ఒక్క యాలుక్కాయ తింటే?

హైదరాబాద్ తర్వాత ప్రపంచంలోనే తొలిసారిగా పరాయి గడ్డ యూకెలో అలాయి బలాయి

డార్క్ చాక్లెట్ తింటే చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుందా?

ఐరన్ లోపం వున్నవాళ్లు ఈ పదార్థాలు తింటే ఎంతో మేలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments