Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా వార్డు నుంచే మన్‌కీబాత్ వీక్షించిన మధ్యప్రదేశ్ సీఎం

Webdunia
ఆదివారం, 26 జులై 2020 (15:23 IST)
Shivraj Singh Chouhan
మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా వార్డులో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వార్డు నుంచే ఆయన ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్ కార్యక్రమాన్ని తిలకించారు. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఆయన భోపాల్‌లోని చిరాయు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ మన్‌కీబాత్ కార్యక్రమాన్ని కరోనా వార్డులో ఉన్న టీవీ ద్వారా వీక్షించారు. మధ్యప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య 26 వేలు దాటగా ఇప్పటి వరకు 791 మంది మరణించారు.
 
మరోవైపు దేశంలో కరోనా వైరస్ తొలిదశలోనే ఉందని, కానీ ఇంకా ప్రమాదకరమేనని ప్రధాని మోదీ అన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతయినా అవసరమని ఆయన కోరారు. ఆదివారం దేశ ప్రజలనుద్దేశించి తన 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా ప్రసంగిస్తూ.. ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ పరిస్థితి ఇతర దేశాలకన్నా మెరుగ్గా ఉందని ఆయన చెప్పారు.
 
లక్షల మంది ప్రాణాలను రక్షించగలిగామని, అయితే దీని ముప్పు ఇంకా తొలగిపోలేదని అన్నారు. టెస్టిగుల సంఖ్య పెరిగిందని, దీంతో మరణాల సంఖ్య కూడా చాలావరకు తగ్గిందని మోదీ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు .కార్గిల్ అమర వీరులకు ఆయన నివాళి అర్పించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments