అధికారం శాశ్వతం కాదు.. వేధింపులకు పాల్పడవద్దు : వెంకయ్య హితవు

Webdunia
గురువారం, 5 అక్టోబరు 2023 (10:18 IST)
దేశంలోని పాలకులకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఓ సూచన చేశారు. అక్రమార్జనకు, ప్రత్యర్థులను వేధించడానికి అధికారాన్ని అడ్డుపెట్టుకోరాదని ఆయన హెచ్చరించారు. అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. 
 
ఉమ్మడి ఏపీ మాజీ హోం మంత్రి టి.దేవేందర్ గౌడ్.. రాజ్యసభల్లో చేసిన ప్రసంగాల ఆధారంగా రూపొందించిన పుస్తకాల ఆవిష్కరణ బుధవారం జూబ్లీహిల్స్‌లో జరిగింది. ఇందులో వెంకయ్య నాయుడు నేటి రాజకీయ పరిస్థితులపై స్పందించారు. 
 
రాజకీయాల్లో అధికార, విపక్ష నేతలు ప్రత్యర్థులుగా ఉండాలనేగానీ శత్రువులుగా ఉండరాదన్నారు. ద్వేషపూరిత, కుట్రపూరిత రాజకీయాలు వద్దని కోరారు. ప్రజాతీర్పును, ప్రతిపక్షాలను గౌరవించాలన్నారు. కొందరు నోపు విప్పితే దుర్భాషలేనని, కర్త, కర్మ, క్రియ అన్నీ అసభ్య పదాలేనని ఆవేదన వ్యక్తం చేశారు. అసభ్యంగా మాట్లాడేవారికి పోలింగ్ బూత్‌లలో ప్రజలు తమ ఓటు హక్కుతో సమాధానం చెప్పాలని కోరారు. 
 
తాను దివంగత మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డిపై ఎన్నో రకాలైన విమర్శలు చేసేవాడినని, అవన్ని కూడా విషయానికి లోబడే ఉండేవని, ఇపుడు ఆ స్థాయి విమర్శలను సహించే పరిస్థితి లేదని విచారం వ్యక్తం చేశారు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని ప్రతి ఒక్క పాలకుడు గుర్తుపెట్టుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments