Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాయానగరంగా న్యూఢిల్లీ, ప్రతి 14 నిమిషాలకు ఓ కారు మాయం

ఐవీఆర్
గురువారం, 14 మార్చి 2024 (23:33 IST)
దేశ రాజధాని న్యూఢిల్లీ మాయానగరంగా మారుతోంది. అక్కడ ప్రతి 14 నిమిషాలకు ఓ కారు దొంగతనం జరుగుతోంది. దేశంలో జరుగుతున్న కార్ల దొంగతనాల్లో 80 శాతం ఢిల్లీలోనే జరుగుతున్నాయంటే కారు దొంగలు ఇక్కడ ఏ స్థాయిలో వున్నదో అర్థం చేసుకోవచ్చు. అక్నో డిజిటిల్ ఇన్సూరెన్స్ వెల్లడించిన నివేదికలో ఈ విషయాలు వెలుగుచూసారు. ఢిల్లీలో తమ కారును అపహరించుకుపోయారంటూ పోలీసు స్టేషన్లలో ప్రతిరోజు ఫిర్యాదు చేస్తున్నవారి సంఖ్య 105గా వున్నట్లు తేలింది. ఈ కేసులను చూస్తే.. గత ఏడాది కంటే రెండున్నర రెట్లు మేర కారు దొంగతనాలు జరిగినట్లు తేలిందని చెబుతున్నారు.
 
ఢిల్లీ నగరం తర్వాత రెండో స్థానంలో చెన్నై మహానగరం ఆక్రమించింది. చెన్నైలో 2022లో జరిగిన కారు దొంగతనాలు 5 శాతం వుంటే ఇప్పుడది 10.5 శాతానికి... అంటే దాదాపు రెట్టింపు అయ్యింది. ఇక మూడోస్థానంలో బెంగళూరు వున్నది. ఐతే హైదరాబాద్, కోల్ కతా వంటి నగరాల్లో కారు దొంగతనాలు అంతగా లేకపోవడం చూస్తుంటే ఇక్కడ పోలీసు భద్రత కట్టుదిట్టంగా వున్నట్లు అర్థమవుతుంది.
 
దొంగిలించబడుతున్న కార్లలో అత్యధికంగా వేగనార్, మారుతి స్విఫ్ట్, మారుతి డిజైర్, హుండయ్ ఐటెన్ కార్లు అధికంగా వుంటున్నట్లు తేలింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments