Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణం.. ఆహారంలో మానవ చేతిగోళ్లు..!

Webdunia
శుక్రవారం, 14 జులై 2023 (09:41 IST)
ముంబై-గోవా సీఎస్ఎంటీ- మడగావ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఓ ప్రయాణీకుడికి అందించిన ఆహారంలో నాణ్యత కొరవడింది. ఆ ఆహారంలో మానవ వేలుగోళ్లు కనిపించాయి. 
 
దీన్ని వీడియో తీసిన ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, చాలా మంది ప్రజలు రైల్వే అందించే ఆహార నాణ్యతతో తమ చేదు అనుభవాన్ని పంచుకున్నారు.
 
ఈ విషయం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ దృష్టికి వెళ్లడంతో సంబంధిత క్యాటరింగ్ కాంట్రాక్టర్‌పై రూ.25 వేలు జరిమానా విధిస్తూ చర్యలు చేపట్టింది. 
 
ఈ విషయంపై IRCTC అధికారి ఒకరు మాట్లాడుతూ, "రైల్వేలో ప్రయాణికులకు మంచి ఆహారం అందుతుందో లేదో తెలుసుకోవడానికి ఒక బృందాన్ని నియమించారు. కొన్ని ప్రోటోకాల్‌లు అభివృద్ధి చేయబడ్డాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక అధికారి మానిటరింగ్ డ్యూటీలో ఉన్నారు. 
 
ఈసారి IRCTC రత్నగిరిలోని వంటశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. IRCTC తీసుకున్న ఈ చర్య భవిష్యత్తులో ప్రయాణీకులకు మంచి ఆహారం అందేలా చేస్తుంది" అని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం