Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్‌ రైలులో మంటలు... వరుస ప్రమాదాలతో ప్రయాణికుల బెంబేలు

Webdunia
సోమవారం, 17 జులై 2023 (10:11 IST)
దేశంలో సెమీ స్పీడ్ రైళ్లుగా పరుగులు పెడుతున్న వందే భారత్ రైళ్లలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో దున్నపోతును ఢీకొనడంతో ఈ రైలు ముందు డోమ్ ఊడిపోయింది. మరోమారు భారీ వర్షానికి వందే భారత్ రైలు లోపలి భాగం తడిసి ముద్దయింది. తాజాగా వందే భారత్ రైలింజిన్ ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. దీన్ని గమనించిన లోకే పైలెట్లు తక్షణం రైలును నిలిపివేసి మంటలను అదుపు చేడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
ఈ రేలు ఢిల్లీ వెళుతుండగా రాణి కమలాపతి (భోపాల్) - హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. రైలు ఇంజన్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన లోకోపైలెట్లు కుర్వాయి కేథోరా స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అగ్నిమాపకదళ సిబ్బంది రైలు ఇంజిన్ వద్ద చెలరేగిన మంటలను అదుపు చేశారు. ఇంజిన్‌కు మంటలు అంటుకోవడంతో రైలు ఆపిన వెంటనే ప్రయాణికులు కిందికి దిగి పక్కనే కూర్చొన్నారు. రైలు ఇంజిన్‌లోని బ్యాటరీలు తగలబడటం వల్లే ఈ మంటలు చెలరేగాయని, ఈ బ్యాటరీలను తొలగించిన తర్వాత రైలు తిరిగి బయలుదేరి వెళ్లిందని రైల్వే శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: స్టేజ్‌పై సమంత- చిరునవ్వుతో చప్పట్లు కొట్టిన అక్కినేని అమల (వీడియో)

మైసూర్ సబ్బుకు ప్రచారకర్తగా తమన్నా అవసరమా? కర్నాటకలో సెగ!!

Tamannah: మైసూర్ శాండల్ సోప్ అంబాసిడర్‌గా తమన్నా.. కన్నడ హీరోయిన్లు లేరా?

Mega Heros: మెగా హీరోలకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్తున్నాను : విజయ్ కనకమేడల

Yash; రామాయణంలో రామ్‌గా రణబీర్ కపూర్, రావణ్‌గా యష్ షూటింగ్ కొనసాగుతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments