Webdunia - Bharat's app for daily news and videos

Install App

వందే భారత్‌ రైలులో మంటలు... వరుస ప్రమాదాలతో ప్రయాణికుల బెంబేలు

Webdunia
సోమవారం, 17 జులై 2023 (10:11 IST)
దేశంలో సెమీ స్పీడ్ రైళ్లుగా పరుగులు పెడుతున్న వందే భారత్ రైళ్లలో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. గతంలో దున్నపోతును ఢీకొనడంతో ఈ రైలు ముందు డోమ్ ఊడిపోయింది. మరోమారు భారీ వర్షానికి వందే భారత్ రైలు లోపలి భాగం తడిసి ముద్దయింది. తాజాగా వందే భారత్ రైలింజిన్ ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. దీన్ని గమనించిన లోకే పైలెట్లు తక్షణం రైలును నిలిపివేసి మంటలను అదుపు చేడంతో పెను ప్రమాదం తప్పింది. 
 
ఈ రేలు ఢిల్లీ వెళుతుండగా రాణి కమలాపతి (భోపాల్) - హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. రైలు ఇంజన్‌కు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో అప్రమత్తమైన లోకోపైలెట్లు కుర్వాయి కేథోరా స్టేషన్‌లో రైలును నిలిపివేశారు. 
 
ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, అగ్నిమాపకదళ సిబ్బంది రైలు ఇంజిన్ వద్ద చెలరేగిన మంటలను అదుపు చేశారు. ఇంజిన్‌కు మంటలు అంటుకోవడంతో రైలు ఆపిన వెంటనే ప్రయాణికులు కిందికి దిగి పక్కనే కూర్చొన్నారు. రైలు ఇంజిన్‌లోని బ్యాటరీలు తగలబడటం వల్లే ఈ మంటలు చెలరేగాయని, ఈ బ్యాటరీలను తొలగించిన తర్వాత రైలు తిరిగి బయలుదేరి వెళ్లిందని రైల్వే శాఖ తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్దల మాట, పోలీస్ వారి హెచ్చరిక మన మంచికే : ట్రైలర్ లో వక్తలు

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments