Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుదుచ్చేరి రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా వి.నారాయణ స్వామి

Webdunia
శనివారం, 28 మే 2016 (17:49 IST)
రాష్ట్ర హోదా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరి కొత్త ముఖ్యమంత్రిగా వి.నారాయణ స్వామి ఎంపికయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆయన పేరును సిఫార్సు చేసింది. దీంతో ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. 
 
ఈనెల 19వ తేదీన వెల్లడైన ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీకి 15 అసెంబ్లీ సీట్లు రాగా, మిత్రపక్షమైన డీఎంకేకు రెండు సీట్లు వచ్చాయి. దీంతో మొత్తం 30 సీట్లున్న పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమైంది. 
 
అయితే, ముఖ్యమంత్రి ఎవరన్న అంశంపై గత వారం రోజులుగా చర్చలు జరిగాయి. ముఖ్యంగా పలువురు సీనియర్ నేతలు ఈ పదవి కోసం పోటీపడ్డారు. వీరందరినీ తోసిరాజనీ, ఢిల్లీ పెద్దలతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగివున్న కేంద్ర మాజీ మంత్రి వి.నారాయణ స్వామిని సీఎం పదవి వరించింది. 
 
ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై పుదుచ్చేరిలో కొత్తగా ఎంపికైన ఎమ్మెల్యేలతో శనివారం సమావేశం జరిగింది. ఇందులో ఢిల్లీ దూతలుగా మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్, ముకుల్ వాస్నిక్‌లు హాజరయ్యారు. ఇందులో సోనియా మాటగా నారాయణ స్వామి పేరును ప్రతిపాదించారు. దీంతో ఆయన కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments