Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరాఖండ్‌లో ఘోరం.. ఆ రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు - 13 మంది మృతి

Webdunia
శనివారం, 18 నవంబరు 2023 (09:37 IST)
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వాహనం లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాతపడ్డారు. అలాగే, గుజరాత్ రాష్ట్రంలో కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడం వల్ల మరో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. శనివారం జరిగిన ఈ రెండు ప్రమాదాల్లో 13 మంది చనిపోయారు. 
 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని నైనితాల్ జిల్లాలో ద్విచక్రవాహనాన్ని తప్పించబోయిన ఓ పికప్ వాహనం అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న వారిలో 8 మంది చనిపోయారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. 
 
కొందరు ప్రయాణికులతో పికప్ వ్యాన్ హల్ద్వానీ ప్రాంతం వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. చీరాఖాన్ - రీతా సాహిహ్ మోటార్ రోడ్డులో ప్రయాణిస్తుండగా, వ్యాన్ డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో అదుపు తప్పి 500 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే అందులోని ప్రయాణికుల అరుపులు విన్న చుట్టుపక్కల గ్రామస్థలు ఘటనాస్థలికి చేరుకోన్నారు. వెంటనే అధికారులకు సమాచారం అందించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments