Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫ్రెండ్‌తో కలిసి బయటకెళ్లిన యువతిపై సామూహిక అత్యాచారం...

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (11:14 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన స్నేహితులతో కలిసి బయటకెళ్ళిన ఓ యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. బరేలీలో గత నెల 31న జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిందితుల్లో ముగ్గురిని ఇప్పటికే అరెస్టు చేయగా, మిగతా వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
పోలీసుల కథనం ప్రకారం.. బాధిత యువతి తన స్నేహితులైన ఇద్దరు యువకులతో కలిసి స్కూటీపై బయటకు వెళ్లింది. ఈ క్రమంలో వారిని అడ్డగించిన ఓ యువకుడు తన స్నేహితులను అక్కడికి పిలిపించాడు. 
 
వారొచ్చి బాధితురాలి స్నేహితులను బెదిరించి అక్కడి నుంచి పంపేసి యువతిపై వారంతా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమె వద్దనున్న డబ్బులు తీసుకుని పరారయ్యారు.
 
జరిగిన ఘోరం గురించి పెదవి విప్పని బాధితురాలు తాజాగా తన సోదరికి వివరించింది. దీంతో ఆమె కుటుంబ సభ్యుల సహకారంతో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను గుర్తించారు. ఆదివారం వారిని పట్టుకునేందుకు వెళ్లగా పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయేందుకు ప్రయత్నించారు. 
 
అయినా వెనక్కి తగ్గని పోలీసులు  ఓ నిందితుడి కాలుపై కాల్చడంతో ఇద్దరు నిందితులు చిక్కారు. వారిని విశాల్ పటేల్ (22), అనుజ్ పటేల్ (23) గా గుర్తించారు. సోమవారం మరో నిందితుడిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీత లేని ఇంటికి ఇప్పటివరకు వెళ్లలేదు : పార్తిబన్

Raj Tarun: ఏం బతుకురా నాది అంటున్న రాజ్ తరుణ్

ఇంటిల్లిపాదినీ నవ్వించే సారంగపాణి జాతకం సిద్ధం : నిర్మాత

Santosh Shobhan: సంతోష్ శోభన్ హీరోగా కపుల్ ఫ్రెండ్లీ షూటింగ్ కంప్లీట్

అల్లరి నరేష్ కొత్త సినిమా పేరు 12A రైల్వే కాలనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments