Webdunia - Bharat's app for daily news and videos

Install App

జవాబు పత్రంలో రూ.100 నోటు పెడితే.. గుడ్డిగా మార్కులేస్తారు...

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (12:53 IST)
విద్యార్థులకు నాలుగు మంచి మాటలు నేర్పి భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువు... వక్రమార్గంలో పయనించాడు. కష్టపడి చదివి, మంచి మార్కులు తెచ్చుకోవాలని చెప్పాల్సిన గురువు... తప్పుడు మార్గంలో మార్కులు ఎలా సంపాదించుకోవాలో విద్యార్థులకు వివరించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారాన్ని పరిశీలిస్తే, 
 
ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మంగళవారం నుంచి టెన్త్, ఇంటర్‌ బోర్డు పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఎగ్జామ్స్‌ ప్రారంభం కంటే ముందు మావు జిల్లాలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన ప్రిన్సిపాల్‌ ప్రవీణ్‌ మాల్‌ తమ విద్యార్థులకు బోర్డు ఎగ్జామ్స్‌పై ఓ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి విద్యార్థుల తల్లిదండ్రులు కూడా హాజరయ్యారు.
 
ఇందులో ప్రిన్సిపాల్ ప్రసంగిస్తూ, తాను ఛాలెంజ్‌ చేస్తున్నా.. ఏ ఒక్క విద్యార్థి కూడా ఫెయిల్‌ కావడానికి ఆస్కారం లేదు. పరీక్షలంటే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇతరుల చేతులను ఎవరూ తాకకూడదు. కేవలం సైగలతోనే మాట్లాడుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయులంతా తన స్నేహితులే. ఒక వేళ మీరు చిట్టీలు కొడుతూ పట్టుబడ్డ.. ఒకట్రెండు చెంపదెబ్బలు కొడుతారు.. అయినప్పటికీ ఏం బాధపడొద్దు. 
 
ఇక ఒక్క ప్రశ్నను కూడా వదిలిపెట్టొద్దు. మీరు చేయాల్సిందల్లా.. జవాబు పత్రంలో ప్రతి విద్యార్థి రూ.100 పెట్టాలి. దీంతో టీచర్లు గుడ్డిగా మార్కులు వేస్తారు. మీరు ఒక వేళ సమాధానం తప్పు రాసినా.. నాలుగు మార్కుల ప్రశ్నలకు మూడు మార్కులు ఖచ్చితంగా వేస్తారు అని ప్రవీణ్‌ మాల్‌ చెప్పారు.
 
ప్రిన్సిపాల్‌ ప్రసంగం చేస్తున్న సమయంలో అక్కడున్న ఓ విద్యార్థి సీక్రెట్‌గా వీడియో చిత్రీకరించి.. దాన్ని సీఎం యోగి గ్రీవెన్స్‌ సెల్‌లో అప్‌లోడ్‌ చేశాడు. వీడియో ఆధారంగా సీఎం యోగి విచారణకు ఆదేశించారు. దీంతో ప్రవీణ్‌ మాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments