Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సు నిర్లక్ష్యం.. చేతినుంచి జారిపడిన శిశువు మృతి..

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (10:05 IST)
లక్నోలో దారుణం చోటుచేసుకుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అప్పుడే జన్మించిన శిశువు మృతి చెందింది. 
 
ఇలా నర్సు నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన శిశువు మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. మృతశిశువు జన్మించాడంటూ వైద్యులు బుకాయించే యత్నం చేశారు. వివరాల్లోకి వెళితే.. చింతన్‌ ప్రాంతానికి చెందిన మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది.
 
అయితే టవల్‌తో జాగ్రత్తగా ఎత్తుకోవాల్సిన శిశువును నర్సు నిర్లక్ష్యంగా ఒంటిచేత్తో పైకి లేపింది. దీంతో శిశువు జారి కిందపడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలి మృతిచెందాడు. ఇది చూసిన తల్లి ఆర్తనాదాలు పెట్టడంతో భయాందోళనకు గురైన కుటుంబీకులు డెలివరీ రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆసుపత్రి సిబ్బంది వారిని అడ్డుకునేందుకు యత్నించారు.
 
మృత శిశువు జన్మించిందంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే శిశువు ఆరోగ్యంగానే పుట్టాడని, నర్సు తప్పిదం కారణంగానే కిందపడి మృతిచెందినట్లు సదరు తల్లి చెప్పింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం రిపోర్టులో తలకు గాయం కారణంగానే శిశువు మరణించినట్లు వెల్లడైంది. దీంతో ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభద్రతా భావంలో సల్మాన్ ఖాన్ ... భద్రత రెట్టింపు - బుల్లెట్‌ఫ్రూఫ్ వాహనం దిగుమతి!!

జానీ మాస్టర్ మంచివారు.. నిరపరాధి అని తేలితే ఏంటి పరిస్థితి? అని మాస్టర్

తెలుగు సినిమాల్లో పెరిగిపోయిన తమిళ కంపోజర్ల హవా?

జానీపై కేసు పెట్టడం నేను షాక్ లో ఉన్నాను.. కొరియోగ్రాఫర్ అని మాస్టర్

ఈడీ విచారణకు హాజరైన నటి తమన్నా - అసలు కేసు కథేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments