Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సు నిర్లక్ష్యం.. చేతినుంచి జారిపడిన శిశువు మృతి..

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (10:05 IST)
లక్నోలో దారుణం చోటుచేసుకుంది. బాధ్యతగా వ్యవహరించాల్సిన నర్సు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అప్పుడే జన్మించిన శిశువు మృతి చెందింది. 
 
ఇలా నర్సు నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన శిశువు మరణించిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. మృతశిశువు జన్మించాడంటూ వైద్యులు బుకాయించే యత్నం చేశారు. వివరాల్లోకి వెళితే.. చింతన్‌ ప్రాంతానికి చెందిన మహిళ మగ శిశువుకు జన్మనిచ్చింది.
 
అయితే టవల్‌తో జాగ్రత్తగా ఎత్తుకోవాల్సిన శిశువును నర్సు నిర్లక్ష్యంగా ఒంటిచేత్తో పైకి లేపింది. దీంతో శిశువు జారి కిందపడిపోవడంతో తలకు బలమైన గాయం తగిలి మృతిచెందాడు. ఇది చూసిన తల్లి ఆర్తనాదాలు పెట్టడంతో భయాందోళనకు గురైన కుటుంబీకులు డెలివరీ రూంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆసుపత్రి సిబ్బంది వారిని అడ్డుకునేందుకు యత్నించారు.
 
మృత శిశువు జన్మించిందంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. అయితే శిశువు ఆరోగ్యంగానే పుట్టాడని, నర్సు తప్పిదం కారణంగానే కిందపడి మృతిచెందినట్లు సదరు తల్లి చెప్పింది. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోస్టుమార్టం రిపోర్టులో తలకు గాయం కారణంగానే శిశువు మరణించినట్లు వెల్లడైంది. దీంతో ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments