Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రామవేదికపై అమ్మాయిలకు ముద్దులుపెడుతూ.. నృత్యం చేస్తూ అధికారుల మజా...

వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, సమస్యల పరిష్కారం కోసం ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత గ్రామంలో డీజే కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇందులో అధికారులు పాల్గొన్నారు.

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (17:25 IST)
వారంతా ప్రభుత్వ ఉద్యోగులు. కానీ, సమస్యల పరిష్కారం కోసం ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత గ్రామంలో డీజే కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఇందులో అధికారులు పాల్గొన్నారు. పీకలవరకు మద్యం సేవించారు. వేదికపై అమ్మాయిలతో కలిసి డ్యాన్స్ చేశారు. ముద్దులు పెట్టారు. కౌగిలించుకున్నారు. అలా మజా చేసిన అధికారులు చివరకు జిల్లా కలెక్టర్ ఆగ్రహానికి గురికావాల్సి వచ్చింది. 
 
ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గంగాపూర్ గ్రామంలో జరిగింది. యూపీ ప్రభుత్వ ఉద్యోగులైన కౌశిక్, ముఖేష్ కుమార్‌లు ఇద్దరు గంగాపూర్ గ్రామంలో పీకల దాకా తాగి అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వేదికపై అమ్మాయిలకు ముద్దులు పెడుతూ.. నృత్యం చేశారు. మందు మత్తులో ప్రభుత్వ ఉద్యోగులు చేసిన నిర్వాకంపై తీసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. 
 
దీంతో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ప్రభుత్వ ఉద్యోగులు తాగి అమ్మాయిలతో తందనాలాడారని ఆగ్రహం చెందిన హాత్రాస్ జిల్లా కలెక్టరు అవినాష్ కృష్ణ సింగ్ ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. దీంతో మద్యంతాగి అమ్మాయిలతో మజా చేసిన ప్రభుత్వ ఉద్యోగుల మత్తు వదిలినట్లయింది. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments