Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీన్స్ ఫ్యాంట్ వేసుకుందనీ అమ్మాయిని కొట్టి చంపిన రాక్షసులు

Webdunia
శుక్రవారం, 23 జులై 2021 (09:07 IST)
ఇటీవలి కాలంలో మహిళలపై జరుగుతున్న నేరాలు ఘోరాల సంఖ్య పెరిగిపోతోంది. ముఖ్యంగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటనలు అధికంగా జరుగుతున్నాయి. తాజాగా ఓ యువతి జీన్స్ ఫ్యాంట్ వేసుకున్నందుకు కొట్టి చంపేశారు. ఈ దారుణం దియోరియో జిల్లాలో జరిగింది. ఆ యువతిని చంపేసి మృతదేహాన్ని ఓ వంతెన రెయిలింగ్‌కు వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కనిపించడం కలకలం రేపింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉపాధి కోసం పంజాబ్‌కు వలస వెళ్లిన ఆ యువతి కుటుంబం మళ్లీ కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి స్వగ్రామానికి వచ్చింది. కాగా, ఆ అమ్మాయి జీవనశైలిపై బంధువులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసేవారు. 
 
ఓ రోజు ఆమె ఉపవాసం చేసి, ఆ సాయంత్రం జీన్స్ ప్యాంట్, టాప్ ధరించి గుడికి వెళ్లేందుకు సిద్ధం కావడంతో తండ్రి ఆమెను వారించాడు. ఆ వేషధారణ సరికాదని అన్నాడు. అయినప్పటికీ ఆ అమ్మాయి తన వేషధారణ మార్చుకోకపోవడంతో అక్కడే ఉన్న ఇతర బంధువులు ఆమెపై కర్రలతో విచక్షణరహితంగా దాడి చేశారు.
 
స్పృహ కోల్పోయిన ఆ అమ్మాయిని ఆసుపత్రికి తీసుకెళుతున్నామని చెప్పి, చనిపోయిన ఆ యువతిని బ్రిడ్జి రెయిలింగ్‌కు వేలాడదీశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments