Webdunia - Bharat's app for daily news and videos

Install App

17 ఏళ్ల బాలికను వేధించారు.. రెండంతస్తుల మేడ నుంచి తోసేశారు..

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (15:08 IST)
17 ఏళ్ల బాలికను వేధించిన ముగ్గురు వ్యక్తులు ఆమె ప్రతిఘటించడంతో రెండంతస్తుల మేడ నుంచి తోసేసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మధురలో చోటుచేసుకుంది. ఈ మొత్తం ఘటన సిసిటివి ఫుటేజ్‌లో రికార్డు అయింది. కాగా, తీవ్రంగా గాయపడ్డ యువతి... ప్రాణాలతో బయటపడ్డప్పటికీ... వెన్నుముక బాగా దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పారు. 
 
కాగా, ముగ్గురు వ్యక్తులుపై తండ్రి ఫిర్యాదు చేశారు. వీరంతా తమ నివాసానికి దగ్గరగా ఉంటారని చెప్పారు. గత కొన్ని రోజులుగా తన కుమార్తెను ఏడిపిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఓ వ్యక్తి తన నెంబర్‌కు ఫోన్‌ చేసి... తన కుమార్తెతో మాట్లాడాలని కోరగా.. ఫోన్‌ ఇవ్వనని చెప్పడంతో... తనను తిట్టడం మొదలు పెట్టాడని తెలిపారు. 
 
అనంతరం అదే రోజు ఆమె ఇంటిలోకి ప్రవేశించి యువతిని వేధించి అక్కడ నుండి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అంతలో కుటుంబ సభ్యులు అరవడంతో రెండవ అంతస్తు బాల్కనీ నుండి కిందకు తోసేయడంతో ఆ యువతి రోడ్డుపై పడిపోయింది. తండ్రి ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పోలీసులు ఇద్దరు నిందితుల్ని అరెస్టు చేశారు. ఈ కేసు విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ నలుగురులో నేను లేను... ఆ నిర్ణయం దుస్సాహసమే : అల్లు అరవింద్

ముఖ్యమంత్రిని కావాలన్న లక్ష్యంతో రాజకీయాల్లోకి రాలేదు : కమల్ హాసన్

సినిమావోళ్లకు కనీస కామన్ సెన్స్ లేదు : నిర్మాత నాగవంశీ

బలగం నటుడు జీవీ బాబు మృతి

అలాంటి వ్యక్తినే ఇరిటేట్ చేశామంటే... మన యానిటీ ఎలా ఉంది? బన్నీ వాసు ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments