Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాకిస్థాన్‌ను భౌతికంగా దెబ్బకొట్టాలి.. సైనిక చర్యకు సిద్ధం కావాలి : మాజీ సైనికుల డిమాండ్

పాకిస్థాన్‌ను భౌతికంగా దెబ్బకొట్టాలని, ఇందుకోసం సైనిక చర్యకు సిద్ధంగా ఉండాలని మాజీ సైనికులు డిమాండ్ చేశారు. భారత-పాక్‌ల నడుమ ఉన్న నియంత్రణ రేఖకు అత్యంత సమీపంలో ఉన్న కీలక గ్రామమైన యూరీలోని సైనిక స్థావర

Webdunia
సోమవారం, 19 సెప్టెంబరు 2016 (08:36 IST)
పాకిస్థాన్‌ను భౌతికంగా దెబ్బకొట్టాలని, ఇందుకోసం సైనిక చర్యకు సిద్ధంగా ఉండాలని మాజీ సైనికులు డిమాండ్ చేశారు. భారత-పాక్‌ల నడుమ ఉన్న నియంత్రణ రేఖకు అత్యంత సమీపంలో ఉన్న కీలక గ్రామమైన యూరీలోని సైనిక స్థావరంపై పాకిస్థాన్ ఉగ్రమూకలు దాడి చేసి 17 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్న విషయంతెల్సిందే. దీనిపై మాజీ సైనికులు తమదైనశైలిలో స్పందించారు. 
 
యూరీ బేస్‌పై దాడి నేపథ్యంలో పాకిస్థాన్‌పై తక్షణచర్యలు తీసుకోవాలని.. పాక్‌ గడ్డపై నుంచి పెచ్చరిల్లుతున్న ఉగ్రవాదులపై సైనికచర్యకు సైతం సన్నద్ధంగా ఉండాలని మాజీ సైనికాధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సూచించారు. అవసరమైతే కొన్ని ప్రదేశాల్లో దాడులు చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలని విశ్రాంత లెఫ్టినెంట్‌ జనరల్‌ బీఎస్‌ జైస్వాల్‌ అభిప్రాయపడ్డారు. 
 
ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్థాన్‌కు భౌతికంగా దెబ్బ తగిలితే తప్ప దానికి మన సంయమనం విలువేంటో అర్థం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. పైగా, ఎలాంటి చర్యా తీసుకోబోమన్న ధైర్యంతోనే పాకిస్థాన్‌ పదేపదే ఉగ్రదాడులకు పాల్పడుతోందని రిటైర్డ్‌ మేజర్‌ గౌరవ్‌ ఆచార్య మండిపడ్డారు. కాశ్మీర్‌లో సమస్యలన్నిటికీ మూలం రావల్పిండి(పాకిస్థాన్‌)లో ఉందని ఆయన ధ్వజమెత్తారు. పాక్‌కు బుద్ధి చెప్పాలంటే తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని.. ఆ దేశంలో వాణిజ్యాన్ని నిలపివేయాలని, పాక్‌ 'మోస్ట్‌ ఫేవర్డ్‌ నేషన్‌ హోదా'ను తగ్గించాలని గౌరవ్‌ ఆచార్య సూచించారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments