Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔట్‌సోర్సింగ్‌లో రిజర్వేషన్లు వర్తిస్తాయా? ఓబీసీలకు 54 శాతానికి పెంచండి : ఎస్పీ

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (17:15 IST)
దేశంలో ఉన్న వెనుకబడిన తరగతుల ప్రజలకు 54 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సీనియర్ రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశంలో 98 శాతం పేదలకు కేవలం 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటని 54 శాతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చిన ఓబీసీ బిల్లుపై బుధవారం రాజ్యసభలో పూర్తిస్థాయి చర్చ జరిగింది. ఇందులో రాంగోపాల్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపారు. 98 శాతం ఉన్న ప్రజలకు కేవలం 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అందువల్ల జనాభా ప్రాతిపదికన బలహీన వర్గాల ప్రజలకు 54 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
అలాగే, ఇపుడు ఉద్యోగాలన్నీ ఔట్‌సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారనీ, ఈ రిజర్వేషన్ల వర్తింపు ఔట్‌సోర్సింగ్‌కు కూడా వర్తిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ పరీక్షల్లో జనరల్ కేటగిరీలో దళితులు కటాఫ్ మార్కుల కన్నా ఎక్కువ సాధించినా వారిని రిజర్వేషన్ కోటాలోనే ఎందుకు ఎంపిక చేస్తున్నారంటూ ఆయన సర్కారును నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments