Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఔట్‌సోర్సింగ్‌లో రిజర్వేషన్లు వర్తిస్తాయా? ఓబీసీలకు 54 శాతానికి పెంచండి : ఎస్పీ

Webdunia
బుధవారం, 9 జనవరి 2019 (17:15 IST)
దేశంలో ఉన్న వెనుకబడిన తరగతుల ప్రజలకు 54 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సీనియర్ రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. దేశంలో 98 శాతం పేదలకు కేవలం 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటని 54 శాతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చిన ఓబీసీ బిల్లుపై బుధవారం రాజ్యసభలో పూర్తిస్థాయి చర్చ జరిగింది. ఇందులో రాంగోపాల్ యాదవ్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలిపారు. 98 శాతం ఉన్న ప్రజలకు కేవలం 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అందువల్ల జనాభా ప్రాతిపదికన బలహీన వర్గాల ప్రజలకు 54 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. 
 
అలాగే, ఇపుడు ఉద్యోగాలన్నీ ఔట్‌సోర్సింగ్ విధానంలోనే భర్తీ చేస్తున్నారనీ, ఈ రిజర్వేషన్ల వర్తింపు ఔట్‌సోర్సింగ్‌కు కూడా వర్తిస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ పరీక్షల్లో జనరల్ కేటగిరీలో దళితులు కటాఫ్ మార్కుల కన్నా ఎక్కువ సాధించినా వారిని రిజర్వేషన్ కోటాలోనే ఎందుకు ఎంపిక చేస్తున్నారంటూ ఆయన సర్కారును నిలదీశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments