Webdunia - Bharat's app for daily news and videos

Install App

గేదెలు కొనుగోలు చేసేందుకు రెండో పెళ్ళికి సిద్ధమైన మహిళ... అత్తామామలు రావడంతో...

ఠాగూర్
సోమవారం, 24 ఫిబ్రవరి 2025 (13:19 IST)
గేదెలు కొనుగోలు చేసేందుకు ఓ మహిళ రెండో పెళ్ళికి సిద్ధమైంది. మరికొన్ని క్షణాల్లో పెళ్ళి జరుగుతుందనగా అత్తామామలు వచ్చారు. దీంతో ఆ మహిళ షాకైంది. పెళ్ళి ఆగిపోయింది. ఈ ఆసక్తికర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
యూపీలోని హాసన్ పూర్‌కు చెందిన ఆస్మా అనే మహిళ మూడేళ్ల క్రితం నూర్ మహ్మద్‌ను పెళ్లి చేసుకుంది. అయితే, భర్తతో మనస్పర్థలు రావడంతో ఆరు నెలల క్రితం విడాకులకు దరఖాస్తు చేసుకుంది. ఈ కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఇంతలోనే మరో పెళ్లికి సిద్ధమైంది. ఈ విషయం తెలుసుకున్న నూర్ మహ్మద్ తల్లిదండ్రులు, పెళ్ళి సర్టిఫికేట్ తీసుకుని వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. 
 
దానిని పరిశీలించిన తర్వాత నిర్వాహకులు పోలీసులను పిలిపించి ఆస్మా, ఆమెకు కాబోయే భర్తపై ఫిర్యాదు చేశారు. విడాకులు తీసుకోకుండా రెండో పెళ్లి ఎందుకు చేసుకుంటున్నావని ప్రశ్నించగా, ఇది కేవలం ఓ నాటకమని, పెళ్ళి జరిగిన తర్వాత ప్రభుత్వం ఇచ్చే డబ్బును చెరిసంగ పంచుకునేలా ఒప్పందం చేసుకున్నామని ఆస్మా వెల్లడించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో రవితేజ ఇంట్లో విషాదం.. ఏంటది?

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments