UP: ఎందుకొచ్చిన గొడవ.. ప్రియుడితో భార్యకు పెళ్లి చేయించిన భర్త.. ఎక్కడో తెలుసా? (video)

సెల్వి
బుధవారం, 20 ఆగస్టు 2025 (21:53 IST)
UP man
ఎందుకొచ్చిన గొడవ అనుకున్నాడో ఏమో కానీ.. ప్రియుడితో సన్నిహితంగా వున్న భార్యకు భర్తే పెళ్లి చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో భార్య తన ప్రియుడితో కలిసి భర్త కంటికి చిక్కింది. దీంతో ఆ భర్త ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దగ్గరుండి ప్రియుడితో భార్యకు పెళ్లి జరిపించాడు. 
 
వివరాల్లోకి వెళ్తే.. మీర్జాపూర్‌ జిల్లాని అర్వింద్ పటేల్ అనే వ్యక్తి.. చందౌలి జిల్లా హమీద్‌పూర్‌కు చెందిన రీనా అనే మహిళను 25 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు ఎదిగిన పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఆమెకు సియారామ్‌ యాదవ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వాళ్ల పరిచయమే క్రమంగా వివాహేతర సంబంధం వరకు దారి తీసింది. దాదాపు 20 ఏళ్లుగా వీళ్ల మధ్య వివాహేతర సంబంధం అలా సాగుతూనే వస్తోంది. 
 
అర్వింద్‌ పటేల్‌కు వాళ్లపై అనుమానం రావడంతో పలుసార్లు పట్టుకునే ప్రయత్నం కూడా చేశాడు. కానీ ఈసారి రెడ్‌ హ్యాండెడ్‌గా వాళ్లిద్దరూ దొరికిపోయారు. ఈ ఘటనపై అర్వింద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సియారామ్, అలాగే తన భార్య కుటుంబీకులకు కూడా ఈ విషయం చెప్పాడు. 
 
ఇద్దరి కుటుంబ సభ్యులను పిలిపించి మాట్లాడాడు. చివరికి వాళ్లిద్దరికీ పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ల కుటుంబ సభ్యులను కూడా ఒప్పించాడు. ఈ క్రమంలోనే వారణాసిలోని ఓ గుడిలో వాళ్లకు పెళ్లి జరిపించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chiranjeevi: క్లైమాక్స్ ఫైట్ షూటింగ్ లో మన శంకరవరప్రసాద్ గారు

Prashanth Varma: నా పై ఆరోపణలు అబద్దం, ప్రతీకారం గా జరుగుతున్నాయి: ప్రశాంత్ వర్మ

Suma: దంపతుల జీవితంలో సుమ కనకాల ఎంట్రీ తో ఏమయిందనే కథతో ప్రేమంటే

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments