Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంటర్ పాసైతే బాలికలకు స్మార్ట్ ఫోన్లు.. డిగ్రీ పూర్తి చేస్తే స్కూటీలు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (17:14 IST)
వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పలు వరాలు గుప్పిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విద్యార్ధినులు, యువతులకు గురువారం పలు వరాలు ప్రకటించారు. 
 
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే ఇంటర్ ఉత్తీర్ణులైన బాలికలకు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యుయేషన్ చేసే యువతులకు స్కూటీలను ఉచితంగా అందచేస్తామని ఆమె వెల్లడించారు.
 
యూపీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ఆమోదం మేరకు తాను ఈ నిర్ణయం ప్రకటిస్తున్నానని ప్రియాంక గాంధీ తెలిపారు. ఈ వివరాలు వెల్లడిస్తూ ప్రియాంక గాంధీ ఓ పోస్ట్‌ను ట్వీట్ చేశారు. 
 
కాలేజీ విద్యార్ధినులతో ముచ్చటిస్తున్న వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ప్రియాంక గాంధీ తమను కష్టపడి చదువుకోవాలని కోరారని, తమ భద్రత కోసం ఆమె స్మార్ట్‌ఫోన్లు అందిస్తామని చెప్పారని ఈ వీడియోలో ఓ యువతి చెబుతుండటం కనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments