ఇంటర్ పాసైతే బాలికలకు స్మార్ట్ ఫోన్లు.. డిగ్రీ పూర్తి చేస్తే స్కూటీలు

Webdunia
గురువారం, 21 అక్టోబరు 2021 (17:14 IST)
వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పలు వరాలు గుప్పిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విద్యార్ధినులు, యువతులకు గురువారం పలు వరాలు ప్రకటించారు. 
 
యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే ఇంటర్ ఉత్తీర్ణులైన బాలికలకు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యుయేషన్ చేసే యువతులకు స్కూటీలను ఉచితంగా అందచేస్తామని ఆమె వెల్లడించారు.
 
యూపీ కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ ఆమోదం మేరకు తాను ఈ నిర్ణయం ప్రకటిస్తున్నానని ప్రియాంక గాంధీ తెలిపారు. ఈ వివరాలు వెల్లడిస్తూ ప్రియాంక గాంధీ ఓ పోస్ట్‌ను ట్వీట్ చేశారు. 
 
కాలేజీ విద్యార్ధినులతో ముచ్చటిస్తున్న వీడియోను కూడా ఆమె షేర్ చేశారు. ప్రియాంక గాంధీ తమను కష్టపడి చదువుకోవాలని కోరారని, తమ భద్రత కోసం ఆమె స్మార్ట్‌ఫోన్లు అందిస్తామని చెప్పారని ఈ వీడియోలో ఓ యువతి చెబుతుండటం కనిపించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

తర్వాతి కథనం
Show comments