Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలుకను చంపిన నిందితుడిపై 30 పేజీల చార్జిషీట్

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (09:19 IST)
ఎలుకను చంపిన కేసులో నిందితుడిపై పోలీసులు 30 పేజీల చార్జిషీటును తయారు చేసి కోర్టుకు అందజేశారు. ఈ ఎలుక హత్య గత యేడాది నవంబరులో జరిగింది. ఎలుక తోకకు రాయికట్టిన నిందితుడు కుమార్ దానికి కాలువలో పడేశాడు. దీంతో అది చనిపోయింది. దీన్ని గమనించిన వికేంద్రశర్మ అనే వ్యక్తి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయగా, అది అప్పటికే చనిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
దీంతో నిందితుడిపై వికేంద్రశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత నిందితుడు బెయిలుపై విడుదలయ్యాడు. ఎలుక కళేబరానికి శవపరీక్ష చేసి ఫోరెన్సిక్ నివేదికను తయారు చేశారు. ఇందులో కాలేయ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకిందని, ఫలితంగా అది ఊపిరాడక చనిపోయినట్టు తేలింది. 
 
ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా నిందితుడు కుమార్‌పై 30 పేజీల చార్జి‌షీటును దాఖలు చేశారు. కాగా, ఈ ఘటనపై కుమార్ తండ్రి మతూరా కుమార్ మాట్లాడుతూ, తన కుమారుడిపై చర్యలు తీసుకోవడానికి ముందు కోళ్లు,చేపలు, గొర్రెల మాంసాన్ని విక్రయించే వారిపైన, ఎలుకలను చంపే రసాయనాలు అమ్మే వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments