Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎలుకను చంపిన నిందితుడిపై 30 పేజీల చార్జిషీట్

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2023 (09:19 IST)
ఎలుకను చంపిన కేసులో నిందితుడిపై పోలీసులు 30 పేజీల చార్జిషీటును తయారు చేసి కోర్టుకు అందజేశారు. ఈ ఎలుక హత్య గత యేడాది నవంబరులో జరిగింది. ఎలుక తోకకు రాయికట్టిన నిందితుడు కుమార్ దానికి కాలువలో పడేశాడు. దీంతో అది చనిపోయింది. దీన్ని గమనించిన వికేంద్రశర్మ అనే వ్యక్తి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయగా, అది అప్పటికే చనిపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. 
 
దీంతో నిందితుడిపై వికేంద్రశర్మ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత నిందితుడు బెయిలుపై విడుదలయ్యాడు. ఎలుక కళేబరానికి శవపరీక్ష చేసి ఫోరెన్సిక్ నివేదికను తయారు చేశారు. ఇందులో కాలేయ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకిందని, ఫలితంగా అది ఊపిరాడక చనిపోయినట్టు తేలింది. 
 
ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా నిందితుడు కుమార్‌పై 30 పేజీల చార్జి‌షీటును దాఖలు చేశారు. కాగా, ఈ ఘటనపై కుమార్ తండ్రి మతూరా కుమార్ మాట్లాడుతూ, తన కుమారుడిపై చర్యలు తీసుకోవడానికి ముందు కోళ్లు,చేపలు, గొర్రెల మాంసాన్ని విక్రయించే వారిపైన, ఎలుకలను చంపే రసాయనాలు అమ్మే వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments