Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుంభమేళాతో ఓ కుటుంబం రూ.30 కోట్లు సంపాదించిందంటున్న సీఎం యోగి.. ఎలా?

ఠాగూర్
బుధవారం, 5 మార్చి 2025 (10:53 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో 45 రోజుల పాటు సాగిన మహాకుంభమేళాలో ఒక కుటుంబం ఏకంగా రూ.30 కోట్లు సంపాదించిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అలాగే, ఈ కుంభమేళా మహోత్సవం అనేక మందికి ఎంతో కొంత ఆర్థికంగా లాభపడిందన్నారు. ఓ కుటుంబం 130 పడవలు నడిపి రూ.30 కోట్లు అర్జించినట్టు తెలిపారు. కుంభమేళా సందర్భంగా ప్రయాగ్ రాజ్‌లో పడవలు నడిపేవారు దోపిడీకి గురయ్యారంటూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు చేసిన ఆరోపణలపై సీఎం యోగి పై విధంగా స్పందించారు. 
 
తాను ఒక పడవ నిడిపే వ్యక్తి విజయగాథను మీతో పంచుకుంటాను. ఆ కుటుంబానికి 130 ఉన్నాయని, ఒక్కో పడవతో గరిష్టంగా రూ.52 వేల వరకు సంపాదించారని తెలిపారు. 45 రోజుల్లో ఒక్కో పడవతో రూ.23 లక్షలు చొప్పున సంపాదించారని, మొత్తంగా 130 పడవలతో రూ.30 కోట్ల వరకు అర్జించినట్టు సీఎం వివరించారు. 
 
ఎలాంటి అవాంతరాలు లేకుండా కుంభమేళాను విజయవంతంగా నిర్వహించామని యోగి తెలిపారు. 45 రోజుల్లో ఒక్క నేరం కూడా జరగలేదన్నారు. కుంభమేళా నిర్వహణకు ప్రభుత్వం రూ.7500 కోట్లు ఖర్చు చేయగా దాదాపు రూ.3 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని సీఎం సభకు తెలిపారు. హోటల్ పరిశ్రమ రూ.40 వేల కోట్లు, ఆహారం, ఇతర నిత్యావసర రంగానికి రూ.33  వేల కోట్లు, రవాణాకు రూ.1.5 లక్షల కోట్ల మేర ఆదాయం లభించినట్టు సీఎం యోగి తెలిపారు. ఈ యేడాది జీడీపీ వృద్ధికి ఈ కుంభమేళా ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments