Webdunia - Bharat's app for daily news and videos

Install App

యోగి ఆదిత్యనాథ్ తండ్రి మృతి.. కడసారి చూపుకు నోచుకోని సీఎం

Webdunia
సోమవారం, 20 ఏప్రియల్ 2020 (14:59 IST)
ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిష్త్ సోమవారం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సంతాపాలు వెల్లువెత్తున్నాయి. 89 ఏళ్ల ఆనంద్ సింగ్ బిష్త్.. కాలేయం, మూత్రపిండాల సమస్యలతో ఇటీవల ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. ఆరోగ్యం విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనీ.. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని గవర్నర్ ఆనందీబెన్ పటేల్ పేర్కొన్నారు. 
 
డిప్యూటీ సీఎం కేశవ్ మౌర్య కూడా ట్విటర్లో సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాదం నుంచి వారి కుటుంబం త్వరగా కోలుకోవాలని భవంతుడిని ప్రార్థిస్తున్నట్టు ఆయన తెలిపారు. మరోవైపు తండ్రి మరణానికి తీవ్రంగా దు:ఖిస్తున్నానని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
 
అయితే కరోనా మహమ్మారి కారణంగా తాను అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నానని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తన తండ్రి కడసారి చూపుకు కూడా నోచుకోలేకపోతున్నానని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 
 
యోగి తండ్రి భౌతిక కాయాన్నిఉత్తరాఖండ్‌లోని పౌరీ గ్రామానికి తరలించారు. మంగళవారం ఉదయం అంతిమ సంస్కారాలు జరుగుతాయని ఆయన తరపు బంధువులు ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments